► రాష్ట్ర న్యాయవాది నారిమన్తో చర్చించాకే తుది నిర్ణయం
► అఖిలపక్ష భేటీలో తీర్మానం
సాక్షి, బెంగళూరు: ‘కావేరి నదీ జలాల పంపకం విషయమై కేంద్ర ప్రభుత్వం సూచించినట్లు నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలా, వద్దా అన్న విషయంలో సీనియర్ న్యాయవాది ఫాలీ ఎస్. నారిమన్ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలి’ అని రాష్ట్ర అఖిలపక్షం నిర్ణయించింది. కావేరి నదీ జలాల పంపకంపై తరచుగా తమిళనాడు, కర్ణాకట, కేరళ, పుదుచ్చేరీల మధ్య భిన్నాభిప్రాయాలు వస్తుండడం తెలిసిందే. తమిళనాడు, కర్ణాటకలు కావేరి విషయంలో ప్రతి ఏడాది కోర్టు లేదా కావేరి ట్రైబ్యునల్కు వెళ్లడంతో సమస్య జఠిలమవుతోంది.
వర్షాభావం ఏర్పడినప్పుడు కావేరి నదీజలాల పంపకాలపై స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో నదీజలాల పంపకానికి సంబంధించి నిపుణులతో కూడిన కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తోంది. ఈ విషయమై ఆయా రాష్ట్రాల అభిప్రాయాలను అడిగింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన అన్ని పార్టీలకు చెందిన నాయకులు విధానసౌధలో సమావేశమమయ్యి నిపుణుల కమిటీ ఏర్పాటు వల్ల కలిగే లాభనష్టాల పై చర్చించారు.
వారంలోపు నారిమన్తో భేటీ
జులైలో సుప్రీం కోర్టులో కావేరి నదీజలాలల పంపకంపై తీర్పు వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ తరుణంలో నిపుణుల కమిటీ ఏర్పాటు చేస్తే కలిగే ఇబ్బందులపై చర్చించారు. ఈ విషయంలో కావేరిపై కర్ణాటక తరఫున సుప్రీం కోర్టులో వాదనలు వినిపిస్తున్న నారిమన్ సలహా తీసుకోవాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. భేటీ అనంతరం ఎం.బీ పాటిల్ మీడియాతో మాట్లాడుతూ... మరో వారంలోపు ఉన్నతాధికారులో చర్చించి, నారిమన్తో భేటీ అయ్యి నిపుణుల కమిటీ ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటామన్నారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసం కావేరి విషయంలో రాజకీయాలకు అతీతంగా ముఖ్యమంత్రికి మద్దతునిస్తామని సమావేశంలో పాల్గొన్న బీజేపీ నేత జగదీష్ శెట్టర్ తెలిపారు. మండలిలో బీజేపీ పక్ష నాయకుడు కే.ఎస్ ఈశ్వరప్ప, శాసనసభలో జేడీఎస్పక్షనేత కుమారస్వామి గైర్హాజరయ్యారు.
కావేరిపై నిపుణుల కమిటీ !
Published Wed, May 10 2017 9:11 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్మన్ గిల్కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement