స్థానిక ఉత్తమ్నగర్లోని ఓ గోదాములో ఎనిమిది వేలకుపైగా మద్యం సీసాలు లభించాయి. ఇందుకు సంబంధించి
సాక్షి, న్యూఢిల్లీ : స్థానిక ఉత్తమ్నగర్లోని ఓ గోదాములో ఎనిమిది వేలకుపైగా మద్యం సీసాలు లభించాయి. ఇందుకు సంబంధించి ఎన్నికల కమిషన్ కేసు నమోదు చేసింది. శుక్రవారం రాత్రి పోలీసులు, ఫ్లైయింగ్ స్క్వాడ్ చేసిన మెరుపుదాడిలో ఇవి లభ్యమయ్యాయి. ఈ విషయాన్ని ఎన్నికల అధికారి ఒకరు వెల్లడించారు. ఇవి హరియాణాలో తయారైనట్టుగా వాటిపై ఉన్న ముద్రలు చెబుతుననాయి. ఇవి ఈ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఆప్ అభ్యర్థి నరేష్ బలియాన్వేనని బీజేపీ ఆరోపించింది. అయితే ఈ మద్యానికి తనకు ఏ సంబంధం లేదని నరేష్ బలియాన్ చెప్పారు. మద్యం సీసాలు లభించిన గోదాము బీజేపీ కార్యకర్తదని ఆయన ఆరోపించారు. మరోవైపు పోలీసులు ఇదే విషయమై మాట్లాడుతూ విచారణ పూర్తయ్యాక నిందితుల పేరును ఎఫ్ఐఆర్లో నమోదు చేస్తామన్నారు.