కేజ్రీవాల్‌ సర్కార్‌ కీలక నిర్ణయం

Delhi government free transport facility for public on five days - Sakshi

ఢిల్లీలో ఈ నెల 13 నుంచి 5 రోజుల పాటు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరడంతో...కాలుష్య నియంత్రణపై అరవింద్‌ కేజ్రీవాల్‌ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. సరి, బేసి విధానం అమలు కాలంలో ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేలా నిర్ణయం తీసుకుంది. ఈ నెల 13 నుంచి అయిదు రోజుల పాటు అనగా నవంబర్‌ 17 వరకూ ఈ విధానం అమల్లో ఉండనుంది. ఉచిత ప్రయాణం విషయాన్ని ఢిల్లీ రవాణా శాఖ మంత్రి కైలాష్‌ గెహ్లాట్‌ ధ్రువీకరించారు. ఈ విధానం వల్ల పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టును ఉపయోగించుకునేలా ప్రజలను ప్రోత్సహించినట్లు అవుతుందని ట్విట్‌ చేశారు.

కాగా ప్రస్తుతం ఆర్టీసీ బస్సులకు అదనంగా మరో 600 బస్సులను అద్దెకు తీసుకోవాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. కాగా అధికారిక ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతృత్వంలో సరి-బేసి విధానాన్ని అమలు చేయడం ఇది మూడో సారి. అంతకముందు ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చినప్పుడు కాలుష్య స్థాయిలు కొంతమేర తగ్గిన సంగతి తెలిసిందే. అలాగే  పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టును వాడుకునేలా కారు పార్కింగ్‌ ఛార్జీలను నాలుగు రెట్లు పెంచింది.

మరోవైపు నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ...కేజ్రీవాల్‌ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడింది. సరి-బేసి విధానాన్ని అమలు చేయాలని సుప్రీంకోర్టు ఎప్పుడు చెప్పలేదని ఎన్‌జీటీ వ్యాఖ్యానించింది. సరి-బేసి విధానాన్ని పిక్నిక్‌లా వాడుకుంటున్నారని మండిపడింది. ఈ విధానం అమలు వల్ల పెద్దగా ప్రయోజనం లేదని కేంద్ర, రాష్ట్ర కాలుష్య నివారణ మండళ్లు నివేదిక ఇచ్చిందని, అయినా ఎందుకు అమలు చేస్తున్నారంటూ ఎన్‌టీజీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top