breaking news
pollution in Delhi
-
గాలి నిండా గరళమేనా?!
మనం పీలుస్తున్న గాలి ఎంత నాణ్యమైనది? ఎంత సురక్షితమైనది? పైకి మామూలుగా అనిపించినా, ఇవి ఎంతో కీలకమైన ప్రశ్నలని తాజా ‘ప్రపంచ వాయు నాణ్యతా నివేదిక –2022’తో మరోసారి తెలిసొస్తోంది. ప్రపంచంలోనే అత్యధిక కాలుష్యభరిత రాజధానిగా ఢిల్లీ మొదటి స్థానంలో నిలిచిందన్న మాట ఆందోళన రేపుతోంది. వరుసగా నాలుగో ఏడాది ఢిల్లీకి ఈ అపకీర్తి కిరీటం దక్కడం పరిస్థితి తీవ్రతకు దర్పణం. ప్రపంచ వ్యాప్తంగా 117 దేశాల్లోని 6475 ప్రాంతాల్లో కాలుష్యగణన చేసి, స్విట్జర్లాండ్ సంస్థ ‘ఐక్యూ ఎయిర్’ మంగళవారం విడుదల చేసిన ఈ నివేదిక ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. గడచిన 2020 నాటి కాలుష్య ర్యాంకులను కొట్టిపారేసిన పాలకులు తిరుగులేని సాక్ష్యంతో వచ్చిన తాజా 2021 నివేదికకు ఏం జవాబిస్తారు? కాలుష్యంలో ‘టాప్–100’ నగరాల జాబితా తీస్తే, అందులో 63 నగరాలు మన దేశంలోవే! వాటిలో సగానికన్నా ఎక్కువ ఢిల్లీ చుట్టుపక్కలి హరియాణా, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లోవే. ఈ కఠిన వాస్తవం దేశంలో తక్షణ చర్యల అవసరాన్ని మళ్ళీ గుర్తు చేస్తోంది. గాలిలో కాలుష్యకారక కణాల (పీఎం) వార్షిక సగటు 2.5 స్థాయి అంటే, ఘనపుమీటరుకు 5 మైక్రో గ్రాములకు మించి కాలుష్య కణాలు ఉండకూడదు. కానీ, మన దేశంలో ఏ నగరంలో పరిస్థితీ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెచ్ఓ) నిర్దేశిత ప్రమాణాలకు తగ్గట్టు లేదు. ఉత్తరాదిన మరీ దారుణం. కాలుష్యంలో అగ్రభాగాన నిలిచిన తొలి 15 ప్రపంచ స్థలాల చిట్టాలోనూ ఏకంగా 10 భారతీయ నగరాలే! రాజస్థాన్లోని భివాడీ, ఉత్తర ప్రదేశ్లోని ఘాజియాబాద్, చైనాలోని హోటన్ తర్వాత వాయు కాలుష్యంలో నాలుగో ర్యాంక్ ఢిల్లీదే. రాజధానిలో కాలుష్యం గత ఏడాది కన్నా దాదాపు 15 శాతం ఎక్కువైంది. అక్కడ డబ్ల్యూహెచ్ఓ పరిమితుల కన్నా దాదాపు 20 రెట్లు ఎక్కువ వాయు కాలుష్యం నెలకొంది. విశాఖపట్నం, హైదరాబాద్ లాంటి తెలుగు ప్రాంతాలూ ఈ వాయు కాలుష్య జాబితాలో ఉన్నాయి. ప్రకృతి, పర్యావరణం, జలాశయాల పరిరక్షణ ధ్యేయంగా దశాబ్దాల క్రితం చేసిన జీవో 111ను సైతం తెలంగాణ సర్కార్ ఎత్తివేస్తామంటున్న వేళ... హైదరాబాద్ 232వ స్థానంలో నిలవడం మరింత ఆందోళనకరం. మన దేశంలో ఇప్పుడు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న రెండో అతి పెద్ద కారణం – వాయు కాలుష్యమే. దీనివల్ల ఏటా దాదాపు 15 వేల కోట్ల అమెరికన్ డాలర్ల పైగా ఆర్థిక నష్టం కలుగుతోందని అంచనా. కరోనా కాలంలో లాక్డౌన్ల పుణ్యమా అని దేశంలో వాయు కాలుష్యం గణనీయంగా తగ్గిందని వార్తలు వచ్చాయి. కానీ చిత్రం ఏమిటంటే – ఇప్పుడు మన దేశంలో పీఎం స్థాయి మళ్ళీ లాక్డౌన్ల పూర్వం ఉన్న 2.5కి చేరుకోవడం! వాహన ఉద్గారాలు, ఇంధన ఉత్పత్తి, పారిశ్రామిక వ్యర్థాలు, వంట కోసం బయోమాస్ దహనం, నిర్మాణ రంగం, పంటల కాల్చివేత లాంటివన్నీ ఈ వాయు కాలుష్యానికి మూలాలు. పట్టణ భారతావనిలో అయితే ఈ పీఎం 2.5 స్థాయిలో 20 నుంచి 35 శాతం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మోటారు వాహనాల ఇంజన్ల వల్లేనని నిపుణుల మాట. ఏటా వాహనాల అమ్మకాలు పెరిగిపోతున్న భారత్లో వచ్చే 2030 నాటి కల్లా వాహనాల సంఖ్య 1.05 కోట్లకు చేరుతుందన్న అంచనా మరింత భయపెడుతోంది. నిజానికి, దేశంలో వాయు కాలుష్యాన్ని పర్యవేక్షించడం కోసం 2015 ఏప్రిల్ 7న మోదీ సర్కార్ ఆర్భాటంగా ‘జాతీయ వాయు నాణ్యతా సూచి’ పథకాన్ని ప్రకటించింది. కానీ, వాక్శూరత్వమే తప్ప ఒరిగిందేమీ లేదని తాజా లెక్కలు తేల్చేస్తున్నాయి. 2024 నాటి కల్లా గుర్తించిన నగరాలలో పీఎం స్థాయి 20 నుంచి 30 శాతం మేర తగ్గేలా చూస్తామనీ పాలకులు సంకల్పం చెప్పుకున్నారు. అందు కోసం 2019లో ‘జాతీయ స్వచ్ఛ వాయు పథకం’ (ఎన్సీఏపీ)ని కేంద్ర పర్యావరణ శాఖ చేపట్టింది. అది ఏ మేరకు సఫలమైందన్నదీ స్పష్టం కాలేదు. మూడేళ్ళుగా లాక్డౌన్ సహా రకరకాల కారణా లతో గాలి నాణ్యత పెరుగుతోందని ఆశిస్తుంటే, వాస్తవం తద్విరుద్ధంగా ఉందని తాజా నివేదిక తేల్చేసింది. గత 2020 నాటి నివేదిక వాయు కాలుష్యంలో ప్రపంచంలో భారత్ది మూడో స్థానమని పేర్కొంది. అది ఉపగ్రహ డేటాయే తప్ప క్షేత్రస్థాయి వాస్తవం కాదంటూ అప్పట్లో కేంద్రం కొట్టిపారే సింది. ఇప్పుడీ 2021 నివేదిక క్షేత్రస్థాయి సెన్సర్ల నుంచి సేకరించినదే. ఆ సెన్సర్లలో సగం సాక్షాత్తూ ప్రభుత్వ సంస్థలు నడుపుతున్నవే. పాలకులు బుకాయించడం, మాటలతో మభ్యపెట్టడం కష్టమే. ప్రజల ఆరోగ్యానికే ప్రమాదం గనక సర్కారు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. ప్రధానంగా నగరాల మీదే దృష్టి పెట్టడమూ ఎన్సీఏపీ లాంటి పథకాలలోని లోపమని గుర్తించాలి. కాలుష్య నియంత్రణలో వర్తమాన విధానం విఫలమైనందున సరికొత్త వ్యూహరచన చేయాలి. తాజా నివేదికలో సిఫార్సు చేసినట్టుగా వ్యక్తిగత వినియోగానికి కాలుష్యరహిత స్వచ్ఛ వాయు వాహనాలను వాడేవారికి ప్రోత్సాహకాలు ఇచ్చేలా చట్టాలు చేయడం లాంటివి ఆలోచించాలి. రాష్ట్ర పాలకులు సైతం సీజన్లో మళ్ళీ కొయ్యకాళ్ళను కాల్చడం లాంటివి మొదలు కాకముందే బయో డీకంపోజర్ లాంటివి విస్తృతంగా రైతులకు అందుబాటులోకి తేవాలి. అటు ఢిల్లీ, పంజాబ్ల్లో అధికారంలో ఉన్న ‘ఆప్’, ఇటు హరియాణా, యూపీల్లో గద్దె మీదున్న బీజేపీ సమన్వయంతో జాతీయ రాజధాని ప్రాంతంలో గాలి నాణ్యతను కాపాడాలి. అటవీ పెంపకం లాంటి ఆలోచనలు ఎన్ని చేసినా, చివరకు వాటి అమలులో చిత్తశుద్ధి అవసరం. అది లోపించి, ఆరావళి సహా అనేక అంశాలపై తప్పుదోవలో కొనసాగితే పరిస్థితి ఏటేటా దిగజారుతుంది. మాటల కన్నా చేతలు ముఖ్యమంటున్నది అందుకే! -
‘ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం’
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరడంతో...కాలుష్య నియంత్రణపై అరవింద్ కేజ్రీవాల్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సరి, బేసి విధానం అమలు కాలంలో ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేలా నిర్ణయం తీసుకుంది. ఈ నెల 13 నుంచి అయిదు రోజుల పాటు అనగా నవంబర్ 17 వరకూ ఈ విధానం అమల్లో ఉండనుంది. ఉచిత ప్రయాణం విషయాన్ని ఢిల్లీ రవాణా శాఖ మంత్రి కైలాష్ గెహ్లాట్ ధ్రువీకరించారు. ఈ విధానం వల్ల పబ్లిక్ ట్రాన్స్పోర్టును ఉపయోగించుకునేలా ప్రజలను ప్రోత్సహించినట్లు అవుతుందని ట్విట్ చేశారు. కాగా ప్రస్తుతం ఆర్టీసీ బస్సులకు అదనంగా మరో 600 బస్సులను అద్దెకు తీసుకోవాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. కాగా అధికారిక ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలో సరి-బేసి విధానాన్ని అమలు చేయడం ఇది మూడో సారి. అంతకముందు ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చినప్పుడు కాలుష్య స్థాయిలు కొంతమేర తగ్గిన సంగతి తెలిసిందే. అలాగే పబ్లిక్ ట్రాన్స్పోర్టును వాడుకునేలా కారు పార్కింగ్ ఛార్జీలను నాలుగు రెట్లు పెంచింది. To encourage use of public transport during Odd- Even, Delhi govt to allow free travel for commuters in all DTC and Cluster buses from 13-17 November. — Kailash Gahlot (@kgahlot) November 10, 2017 మరోవైపు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ...కేజ్రీవాల్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడింది. సరి-బేసి విధానాన్ని అమలు చేయాలని సుప్రీంకోర్టు ఎప్పుడు చెప్పలేదని ఎన్జీటీ వ్యాఖ్యానించింది. సరి-బేసి విధానాన్ని పిక్నిక్లా వాడుకుంటున్నారని మండిపడింది. ఈ విధానం అమలు వల్ల పెద్దగా ప్రయోజనం లేదని కేంద్ర, రాష్ట్ర కాలుష్య నివారణ మండళ్లు నివేదిక ఇచ్చిందని, అయినా ఎందుకు అమలు చేస్తున్నారంటూ ఎన్టీజీ ఆగ్రహం వ్యక్తం చేసింది. -
ఢిల్లీలో రెడ్ అలర్ట్ ప్రకటించరా?
న్యూఢిల్లీ: దీపావళి పండుగ తర్వాత ఢిల్లీ నగరంలో కాలుష్యం పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. గాలిలో ప్రామాణికంగా ఉండాల్సిన పీఎం–2.5 స్థాయి ఢిల్లీలో ఏకంగా బుధవారం నాడు 17 రెట్లు పెరిగిపోయింది. విమానాశ్రయంలో విజిబిలిటీ 300 నుంచి 500 వరకే పరిమితమైంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రకారం ఢిల్లీలో కాలుష్యం స్థాయి 494కు చేరుకుంది. చైనాలోని బీజింగ్ నగరంలో ఇటీవల ఎయిర్ కాలుష్యం 300కు చేరుకున్నందుకే నగరంలో రెడ్ అలర్ట్ ప్రకటించి రెండు వారాలపాటు పాఠశాలలను మూసివేశారు. ఫ్యాక్టరీలను మూసేయించారు. రోడ్డపైకి కార్లను అనుమతించలేదు. చాలా మంది పౌరులు ఇళ్లకే పరిమితమయ్యారు. బీజింగ్ కన్నా కాలుష్యం ఎక్కువైనా ఢిల్లీ నగరంలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. పాఠశాలలు, ఫ్యాక్టరీలు యథావిధిగా పనిచేశాయి. కార్లు, ఇతర వాహనాలు తిరిగాయి. కాలి నడకన వెళ్లేవారు వెళ్లారు. వచ్చేవారు వచ్చారు. డెసెంబర్, జనవరి నెలలో తెల్లవారుజామున మంచు కురుస్తుంటే ఎలా మబ్బుగా ఉంటుందో బుధవారం రోజంతా నగరం అలాగే కనిపించింది. దీంతో దీపావళి తర్వాత నగరంలోని వివిధ ప్రాంతాల వాతావరణం పరిస్థితి ఇదంటూ పలువురు ఫొటోలు తీసి ట్విట్టర్ లాంటి సోషల్ మీడియాలో వాటిని షేర్ చేసుకున్నారు. ముంబై, పుణె నగరాల్లో పరిస్థితి ఇలాగే ఉందని వాతావరణ నిపుణులు తెలియజేశారు. వాతావరణ కాలుష్యం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా ఆరు లక్షల మంది పిల్లలు మరణిస్తున్నారని యూనిసెఫ్ ఇటీవలనే వెల్లడించింది. కాలుష్యం వల్ల గుండె, ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయి. అస్తమా ఉన్నవాళ్లకు మరీ కష్టం. పీఎం 2.5 అంటే పార్టికల్ మ్యాటర్ వ్యాసం 2.5 అని అర్థం. మరో రకంగా చెప్పాలంటే 2.5 వ్యాసం మించని చిన్న కాలుష్య రేణువులు. మన వెంట్రుకలో మూడోవంత సన్నగా ఉంటాయి. ఇవి రోజుకు ఒక్క క్యూబిక్ మీటర్ గాలిలో 35 మైక్రోగ్రాములు మించరాదన్నది ప్రామాణికం. -
'అందరూ పాటిస్తేనే విజయవంతం'
న్యూఢిల్లీ: కాలుష్య నియంత్రణకు సరి-భేసి సంఖ్యల విధానాన్ని ఉద్యమంలా అమలు చేయాలని ప్రజలకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. ప్రజలందరూ స్వచ్ఛందంగా దీన్ని పాటించాలని కోరారు. అందరూ పాటిస్తేనే ఈ పాలసీ విజయవంతం అవుతుందన్నారు. ప్రజలంతా తమ వాహనాల వాడకాన్ని తగ్గిస్తే ఢిల్లీలో కాలుష్యాన్ని గణనీయంగా నియంత్రిచొచ్చని చెప్పారు. పాఠశాల విద్యార్థులతో బుధవారం ఆయన ముచ్చటించారు. కాలుష్య నివారణకు చర్యలకు తోడ్పడతామని విద్యార్థులతో ప్రమాణం చేయించారు. వీధులను వాక్యూమ్ క్లీనర్లతో శుభ్రపరిచే కార్యక్రమాన్ని ఏప్రిల్ నుంచి అమలు చేయనున్నట్టు కేజ్రీవాల్ తెలిపారు. తూర్పు, పశ్చిమ ఢిల్లీలో రోడ్లు వేసి ఢిల్లీ గుండా వెళ్లే ట్రక్కులను అటువైపు మళ్లిస్తామని చెప్పారు.