'త్వరలో ఆలయ కమిటీల ఏర్పాటు' | committees of the temple in telangana | Sakshi
Sakshi News home page

'త్వరలో ఆలయ కమిటీల ఏర్పాటు'

Oct 14 2016 1:11 PM | Updated on Sep 4 2017 5:12 PM

త్వరలోనే రాష్ట్రంలోని దేవాలయాల ట్రస్ట్ బోర్డు కమిటీలను ప్రభుత్వ నియమించనుందని విప్ గొంగిడి సునీత వెల్లడించారు.

యాదగిరిగుట్ట: త్వరలోనే రాష్ట్రంలోని దేవాలయాల ట్రస్ట్ బోర్డు కమిటీలను ప్రభుత్వ నియమించనుందని విప్ గొంగిడి సునీత వెల్లడించారు. శుక్రవారం ఆమె స్థానికంగా విలేకరులతో మాట్లాడారు. ఏ కేటగిరీలో ఉన్న యాదాద్రి, భద్రాచలం, వేములవాడ ఆలయాలకు14 మందితో కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అలాగే, బీ కేటగిరీలో 9, సీ కేటగిరీలో 5 మంది సభ్యులతో కమిటీలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోందని చెప్పారు. ఇందుకు సంబంధించి త్వరలోనే నియామకాలు ప్రకటించే ఆలోచనలో ఉందన్నారు. సుమారు వంద నామినేటెడ్ పోస్టులకు ఇప్పటివరకు వేల సంఖ్యలో దరఖాస్తులు అందాయని విప్ వివరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement