శ్రీవారి సేవలో ప్రముఖులు | actors allari naresh, sumanth aswin visits tirumala | Sakshi
Sakshi News home page

శ్రీవారి సేవలో ప్రముఖులు

May 29 2017 10:58 AM | Updated on Sep 5 2017 12:17 PM

ఏడుకొండలపై కొలువుదీరిన శ్రీ వెంకటేశ్వర స్వామిని సోమవారం ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.

తిరుమల: ఏడుకొండలపై కొలువుదీరిన శ్రీ వెంకటేశ్వర స్వామిని సోమవారం ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. ప్రముఖ ప్రవచకుడు చాగంటి కోటేశ్వరరావు, తమిళనాడు రాష్ట్ర మంత్రి అన్చు అళగన్‌, సినీ నటులు అల్లరి నరేష్‌, సుమంత్‌ అశ్విన్‌లు శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రముఖులకు ఆలయ అర్చకులు స్వామివారిని తీర్థప్రసాదాలు అందించి వేదాశీర్వచనం పలికారు. 
 
వినాయకుడిని దర్శించుకున్న నరేష్‌
కాణిపాకం: వరసిద్ధి వినాయక స్వామిని నరేష్‌ ఆదివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. కాగా, నరేష్‌తో సెల్ఫీలు దిగేందుకు ఆలయ సిబ్బంది పోటీ పడ్డారు. ఒక్కసారిగా 50మంది ఆయనకు అడ్డుపడ్డారు. ఆలయంలో సెల్‌ఫోన్ల నిషేధం భక్తులకేనా? ఆలయ సిబ్బందికి లేదా? అని భక్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement