తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ | tri-series: england lost first wicket | Sakshi
Sakshi News home page

తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్

Jan 30 2015 1:19 PM | Updated on Sep 2 2017 8:32 PM

తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్

తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్

భారత్తో మ్యాచ్తో ఇంగ్లండ్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది.

పెర్త్: లక్ష్యఛేదనలో బరిలోకి దిగిన  ఇంగ్లండ్ కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. జట్టు స్కోరు 14 వద్ద బెల్ (10) అవుటయ్యాడు. మోహిత్ శర్మ బౌలింగ్ లో వికెట్ల ముందు దొరికిపోయాడు. మరో ఓపెనర్ అలీకి తోడు టేలర్ క్రీజులోకి వచ్చాడు.  ముక్కోణపు సిరీస్లో భాగంగా శుక్రవారం జరుగుతున్న చివరి లీగ్ మ్యాచ్లో భారత్ 201 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ 48.1 ఓవర్లలో 200 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు రహానె (73), ధవన్ (38) మినహా ఇతర బ్యాట్స్మెన్ ఘోరంగా విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లు ఫిన్ మూడు.. బ్రాడ్, అలీ, వోక్స్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.
 

Advertisement
 
Advertisement
Advertisement