వన్డే వరల్డ్ కప్ లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో సెమీ ఫైనల్లో టీమిండియా 78 పరుగుల వద్ద రెండో వికెట్ ను కోల్పోయింది.
సిడ్నీ:వన్డే వరల్డ్ కప్ లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో సెమీ ఫైనల్లో టీమిండియా 78 పరుగుల వద్ద రెండో వికెట్ ను కోల్పోయింది. విరాట్ కోహ్లీ(1)ను రెండో వికెట్ రూపంలో టీమిండియా నష్టపోయింది. అంతకుముందు ఓపెనర్ శిఖర్ ధావన్ (45; 40 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్స్) పెవిలియన్ కు చేరాడు.
ఆసీస్ విసిరిన 329 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన టీమిండియా పవర్ ప్లేలో ఆకట్టుకున్పప్పటికీ ఆ తరువాత వెనువెంటనే రెండు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది.