మారిన్తో సైనా తుదిపోరు
లక్నో: సయ్యద్ మోడి స్మారక ఇండియన్ గ్రాండ్ప్రి గోల్డ్ టోర్నమెంట్లో పురుషుల సింగిల్స్ టైటిల్ భారత ఆటగాళ్ల ఖాతాలోకే చేరనుంది. హైదరాబాద్కే చెందిన ఇద్దరు అగ్రశ్రేణి క్రీడాకారులు కిడాంబి శ్రీకాంత్, పారుపల్లి కశ్యప్ ఆదివారం జరిగే టైటిల్ పోరుకు సిద్ధమయ్యారు. గతేడాది రన్నరప్గా నిలిచిన శ్రీకాంత్ వరుసగా రెండో ఏడాది ఫైనల్లోకి దూసుకెళ్లడం విశేషం. 2012లో చాంపియన్గా నిలిచిన కశ్యప్ రెండోసారి అంతిమ సమరానికి సిద్ధమయ్యాడు.
శనివారం జరిగిన సెమీఫైనల్లో టాప్ సీడ్, ప్రపంచ ఐదో ర్యాంకర్ శ్రీకాంత్ 12-21, 21-12, 21-14తో ప్రణయ్ (భారత్)పై నెగ్గగా... మూడో సీడ్, ప్రపంచ 15వ ర్యాంకర్ కశ్యప్ 18-21, 22-20, 21-7తో రెండో సీడ్, ప్రపంచ 10వ ర్యాంకర్ విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్)ను ఓడించాడు. రెండు మ్యాచ్ల్లోనూ శ్రీకాంత్, కశ్యప్ తొలి గేమ్ కోల్పోయి తర్వాతి రెండు గేములను సొంతం చేసుకోవడం విశేషం.
మహిళల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ సైనా నెహ్వాల్ (భారత్), ప్రపంచ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్) మధ్య టైటిల్ పోరు జరుగనుంది. సెమీఫైనల్స్లో టాప్ సీడ్ సైనా 21-10, 21-16తో నిచావోన్ జిందాపోన్ (థాయ్లాండ్)పై గెలుపొందగా... మూడో సీడ్ పి.వి.సింధు 13-21, 13-21తో మారిన్ (స్పెయిన్) చేతిలో ఓడిపోయింది. మారిన్ చేతిలో సింధుకిది వరుసగా మూడో పరాజయం కావడం గమనార్హం. గతేడాది ప్రపంచ చాంపియన్షిప్లో, ఆస్ట్రేలియన్ ఓపెన్లో మారిన్ చేతిలోనే సింధు ఓడిపోయింది.
జ్వాల జంట ఓటమి
మహిళల డబుల్స్ సెమీఫైనల్లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప (భారత్) జంట 16-21, 21-19, 21-13తో అమిలియా అలిసియా-ఫీ చో సూంగ్ (మలేసియా) జోడీ చేతిలో ఓడిపోయింది. పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో సుమిత్ రెడ్డి-మనూ అత్రి (భారత్) ద్వయం 12-21, 18-21తో ఇవనోవ్-సొజొనోవ్ (రష్యా) జంట చేతిలో ఓటమి పాలైంది. మిక్స్డ్ డబుల్స్ సెమీఫైనల్లో కె.మనీషా-మనూ అత్రి (భారత్) జంట 24-22, 21-19తో డ్రెమిన్-దిమోవా (రష్యా) జోడీని ఓడించి ఫైనల్కు చేరింది.
శ్రీకాంత్ x కశ్యప్
Published Sun, Jan 25 2015 12:29 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అమెరికా వరల్డ్కప్ జట్టులో ఐదుగురు భారత సంతతి ఆటగాళ్లు..
చావ్లా అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో రెండో బౌలర్గా
గుడిలో సింపుల్గా పెళ్లి చేసుకున్న నటుడి కూతురు (ఫోటోలు)
పార్టీ ఆఫీసులో రాహుల్ గాంధీ పూజలు - వీడియో వైరల్
వెంకటేశ్ అయ్యర్ అద్భుత పోరాటం.. ముంబై టార్గెట్ ఎంతంటే?
సీఎం జగన్ రేపటి ప్రచార సభల షెడ్యూల్ ఇలా..
పిల్లల్ని ఎందుకు కనలేదో తొలిసారి చెప్పిన వితికా
ధనుష్తో విడిపోయిన ఐశ్వర్య.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)
సొంతగూటికి సంజయ్ నిరుపమ్
అమిత్షాపై కోడ్ ఉల్లంఘన కేసు
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement