కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో జరుగుతున్న లీగ్ మ్యాచ్ లో టాస్ గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ ముందుగా బ్యాటింగ్ కు దిగింది.
హైదరాబాద్: ఐపీఎల్-8లో భాగంగా సోమవారం రాత్రి కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో జరుగుతున్న లీగ్ మ్యాచ్ లో టాస్ గెలిచిన
సన్ రైజర్స్ హైదరాబాద్ ముందుగా బ్యాటింగ్ కు దిగింది. డేవిడ్ వార్నర్, శిఖర్ ధావన్ ఇన్నింగ్స్ ఆరంభించారు. సందీప్ శర్మ తొలి బంతి విసిరాడు.
మూడు మార్పులతో హైదరాబాద్ బరిలోకి దిగింది. బిపుల్ శర్మ, కేఎల్ రాహుల్, ట్రెంట్ బౌల్ట్ జట్టులోకి వచ్చారు. గత మ్యాచ్ ఆడిన ఆటగాళ్లతోనే పంజాబ్ ఆడుతోంది.