గురుసాయిదత్ ఓటమి | Sourabh enters semis, Gurusaidutt, Thulasi exit Malaysian GPG | Sakshi
Sakshi News home page

గురుసాయిదత్ ఓటమి

Mar 29 2014 3:22 AM | Updated on Sep 2 2017 5:18 AM

గురుసాయిదత్ ఓటమి

గురుసాయిదత్ ఓటమి

మలేసియా ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల సింగిల్స్‌లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్, ఆరో సీడ్ గురుసాయిదత్ నిష్ర్కమించగా... భారత్‌కే చెందిన సౌరభ్ వర్మ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు.

 సెమీస్‌లో సౌరభ్ వర్మ
 మలేసియా ఓపెన్
 
 జొహర్ బారు: మలేసియా ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల సింగిల్స్‌లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్, ఆరో సీడ్ గురుసాయిదత్ నిష్ర్కమించగా... భారత్‌కే చెందిన సౌరభ్ వర్మ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు.
 
  శుక్రవారం జరిగిన సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్లో గురుసాయిదత్ 12-21, 21-5, 19-21తో వీ ఫెంగ్ చోంగ్ (మలేసియా) చేతిలో పరాజయం చవిచూశాడు. 59 నిమిషాల పాటు ఈ మ్యాచ్ జరిగింది.  మరో క్వార్టర్స్ మ్యాచ్‌లో ఎనిమిదోసీడ్ సౌరభ్ వర్మ 22-20, 18-21, 21-15తో మూడోసీడ్ చెన్ చో (చైనీస్‌తైపీ)పై సంచలన విజయం సాధించాడు.  
 
 మహిళల సింగిల్స్ క్వార్టర్స్ మ్యాచ్‌లో పి.సి.తులసి 17-21, 21-17, 18-21తో అంద్రియాంతి ఫిర్‌దాసరి (ఇండోనేసియా) చేతిలో ఓడింది. పురుషుల డబుల్స్‌లో ఆల్విన్-ఆరుణ్ విష్ణు (భారత్) జోడి 21-18, 21-14తో రెండోసీడ్ వీ షెమ్ గో-కిమ్ వా లిమ్ (మలేసియా) ద్వయం చేతిలో ఓడింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో ప్రణవ్ చోప్రా-సిక్కిరెడ్డి జంట (భారత్) 26-28, 19-21తో సుబాక్తియర్-గ్లోరియా ఇమాన్యుయేల్ (ఇండోనేసియా) జోడి చేతిలో ఓడింది.
 

Advertisement
 
Advertisement
Advertisement