సోమ్‌దేవ్ జంటకు డబుల్స్ టైటిల్


ఏటీపీ చాలెంజర్ టోర్నీ

 కోల్‌కతా: సింగిల్స్‌లో విఫలమైనప్పటికీ... డబుల్స్‌లో రాణించిన భారత టెన్నిస్ స్టార్ సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ కోల్‌కతా ఓపెన్‌లో టైటిల్ సాధించాడు. భారత్‌కే చెందిన తన భాగస్వామి జీవన్ నెదున్‌చెజియాన్‌తో జతకట్టిన సోమ్‌దేవ్‌కు ఫైనల్లో ఆడాల్సిన అవసరం రాలేదు.

 

  భారత జోడీతో తలపడాల్సిన జేమ్స్ డక్‌వర్త్-ల్యూక్ సావిల్లె (ఆస్ట్రేలియా) ద్వయం గాయం కారణంగా ‘వాకోవర్’ ఇచ్చింది. విజేతగా నిలిచిన సోమ్‌దేవ్ జంటకు 3,100 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. లక్షా 91 వేలు) లభించింది. అంతకుముందు జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో రాడూ అల్బోట్ (మాల్దొవా) 7-6 (7/0), 6-1తో జేమ్స్ డక్‌వర్త్ (ఆస్ట్రేలియా)పై గెలిచి టైటిల్ దక్కించుకున్నాడు.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top