బాక్సింగ్ టోర్నీలో సంతోష్‌కు స్వర్ణం | santosh boxing tournament gold | Sakshi
Sakshi News home page

బాక్సింగ్ టోర్నీలో సంతోష్‌కు స్వర్ణం

Dec 26 2014 12:46 AM | Updated on Sep 2 2017 6:44 PM

డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఆలిండియా పురుషుల ఓపెన్ బాక్సింగ్ టోర్నమెంట్‌లో తెలంగాణ బాక్సర్లు సత్తా చాట్టారు.

ఎల్బీ స్టేడియం:  డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఆలిండియా పురుషుల ఓపెన్ బాక్సింగ్ టోర్నమెంట్‌లో తెలంగాణ బాక్సర్లు సత్తా చాట్టారు. విశాఖపట్నంలో జరిగిన ఈ పోటీల్లో తెలంగాణ బాక్సర్ సంతోష్ పసిడి పతకం గెలిచాడు. పి.మనోజ్‌రెడ్డి, ఎం.డి.ఇమ్రాన్, అనురాగ్ కాంస్య పతకాలను గెలుపొందారు. ఎండి. జాహెద్ బెస్ట్ లూజర్  అవార్డును అందుకున్నాడు.
 
 నేడు బాక్సింగ్ సెలక్షన్ కమ్ టోర్నీ
 రాష్ట్ర  సీనియర్ బాక్సింగ్ టోర్నమెంట్ శుక్రవారం ఎల్బీ స్టేడియంలో జరుగుతుంది.   తెలంగాణ బాక్సింగ్ అసోసియేషన్ (టీబీఏ) ఆధ్వర్యంలో జరిగే ఈ టోర్నీలో జాతీయ సీనియర్ బాక్సింగ్ టోర్నీలో పాల్గొనే తెలంగాణ జట్టును ఎంపిక చేయనున్నారు. ఈ టోర్నీలో పాల్గొనే ఆసక్తి గల బాక్సర్లు ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎ.ప్రతాప్‌రెడ్డి (94401-63038)ని సంప్రదించ వచ్చు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement