పటిష్ట స్థితిలో హైదరాబాద్ | sai vikas reddy, chandan sahani push leads hyderabad | Sakshi
Sakshi News home page

పటిష్ట స్థితిలో హైదరాబాద్

Nov 6 2016 10:27 AM | Updated on Sep 4 2018 5:24 PM

కూచ్ బెహర్ అండర్-19 క్రికెట్ టోర్నమెంట్‌లో బ్యాట్స్‌మెన్ రాణించడంతో హైదరాబాద్ జట్టు తొలిరోజు పటిష్ట స్థితిలో నిలిచింది.

కూచ్ బెహర్ క్రికెట్ టోర్నీ  

సాక్షి, హైదరాబాద్: కూచ్ బెహర్ అండర్-19 క్రికెట్ టోర్నమెంట్‌లో బ్యాట్స్‌మెన్ రాణించడంతో హైదరాబాద్ జట్టు తొలిరోజు పటిష్ట స్థితిలో నిలిచింది. రాజ్‌కోట్‌లో సౌరాష్ట్ర జట్టు తో శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ జట్టు 91 ఓవర్లలో 3 వికెట్లకు 284 పరుగులు చేసింది. జి. వి. వినీత్ రెడ్డి (273 బంతుల్లో 124 బ్యాటింగ్; 5 ఫోర్లు, 1 సిక్సర్) అజేయ సెంచరీతో ఆకట్టుకున్నాడు. చందన్ సహాని (58), పి. సాయి వికాస్ రెడ్డి (61) అర్ధసెంచరీలు చేయగా... షేక్ సొహాలి (25 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు.    


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement