'మన్ కీ బాత్'లో సచిన్ టెండూల్కర్ | Sachin and Viswanathan Anand to join PM Narendramodi on Mann ki baat | Sakshi
Sakshi News home page

'మన్ కీ బాత్'లో సచిన్ టెండూల్కర్

Feb 28 2016 10:56 AM | Updated on Oct 9 2018 4:36 PM

'మన్ కీ బాత్'లో సచిన్ టెండూల్కర్ - Sakshi

'మన్ కీ బాత్'లో సచిన్ టెండూల్కర్

ప్రధాని నరేంద్ర మోదీ 'మన్ కీ బాత్' కార్యక్రమం ద్వారా దేశ ప్రజలతో తన అభిప్రాయాలను పంచుకుంటున్న విషయం తెలిసిందే.

ఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ 'మన్ కీ బాత్' కార్యక్రమం ద్వారా దేశ ప్రజలతో తన అభిప్రాయాలను పంచుకుంటున్న విషయం తెలిసిందే. కాగా ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ఆల్ ఇండియా రేడియో ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమంలో మోదీతో పాటు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా ముచ్చటించనున్నారు. పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడనున్నారు.

అలాగే సచిన్ తోపాటు ప్రముఖ చెస్ ఛాంపియన్ విశ్వనాధన్ ఆనంద్ కూడా విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పనున్నారు. ఈ కార్యక్రమాన్ని యాప్ ద్వారా కూడా వినే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement