2011 వరల్డ్‌కప్‌ ఫైనల్ మ్యాచ్‌ ఫిక్సయింది..! | Ranatunga seeks probe into 2011 World Cup final defeat to India | Sakshi
Sakshi News home page

2011 వరల్డ్‌కప్‌ ఫైనల్ మ్యాచ్‌ ఫిక్సయింది..!

Jul 14 2017 5:50 PM | Updated on Sep 5 2017 4:02 PM

2011 వరల్డ్‌కప్‌ ఫైనల్‌ ఫిక్సయిందని శ్రీలంక మాజీ క్రికెటర్‌ అర్జున్‌ రణతుంగ సంచలన ఆరోపణలు చేశారు.



♦ 
శ్రీలంక మాజీ కెప్టెన్‌ రణతుంగ సంచలన వ్యాఖ్యలు
 
కొలంబో: 2011 వరల్డ్‌కప్‌ ఫైనల్‌ శ్రీలంక- భారత్‌ మ్యాచ్‌ ఫిక్సయిందని శ్రీలంక మాజీ క్రికెటర్‌ అర్జున్‌ రణతుంగ సంచలన ఆరోపణలు చేశారు. ఈ మ్యాచ్‌పై వెంటనే విచారణ చేపట్టాలని శ్రీలంక ప్రభుత్వాన్ని రణతుంగ శుక్రవారం డిమాండ్‌ చేశారు. ఈ ఫైనల్‌ మ్యాచ్ కు కామెంటేటర్ గా వ్యవహరించిన రణతుంగ ఫిక్సింగ్‌ ఆరోపణలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.దీనికి సంబంధించి ఓ వీడియోను రణతుంగ ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు. ‘2011 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో శ్రీలంక ఓడిపోవడం నిరాశ కలిగించింది. అప్పుడే నాకు ఈ మ్యాచ్‌ ఫిక్సయిందని అనుమానం నెలకొంది. ఇప్పుడు ఈ మ్యాచ్ పై పూర్తి విచారణ జరుపాలి’  అని రణతుంగ వీడియో పోస్టు చేశారు. 
 
ప్రస్తుతం ఎవరి పేర్లు చెప్పదల్చుకోలేదని ఏదో ఒకరోజు నిజం తెలుస్తుందని రణతుంగ తెలిపారు. ఈ ఫైనల్‌ మ్యాచ్‌లో సంగక్కర కెప్టెన్సీలో తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక భారత్‌కు 275 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఆ తరువాత బ్యాటింగ్‌ దిగిన భారత్‌, ఓపెనర్లు సచిన్‌, సెహ్వాగ్‌ల వికెట్లు త్వరగా కోల్పోయింది. దీంతో శ్రీలంక విజం ఖాయం అనుకున్న సందర్భంలో శ్రీలంక చెత్త ఫీల్డీంగ్ బౌలింగ్ తో మ్యాచ్ ను చేజార్చుకుంది. ఈ అంశాన్ని అప్పట్లో  శ్రీలంక లోకల్ మీడియా ప్రశ్నించినా అంత ప్రాధాన్యత సంతరించుకోలేదు.
 
ఆరు సంవత్సరాల తర్వాత ఇదే అంశాన్ని అర్జున్‌ రణతుంగ లేవేనత్తడంతో శ్రీలంక క్రికెట్ లో కలకలం రేగింది. ఇంతటితో ఆగకుండా ఈ అంశాన్ని, శ్రీలంక క్రికెట్ బోర్డు వ్యవహారాన్ని ప్రెసిడెంట్  మైత్రిపాల్ సిరిసేన, ప్రధాని రాణీ విక్రమ్ సింగ్ లకు ఫిర్యాదు చేస్తానని రణతుంగ పేర్కొన్నారు. ఇక రణతుంగ కెప్టెన్సీలో శ్రీలంక 1996 ప్రపంచకప్ గెలిచింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement