ఐపీఎల్-8 లో భాగంగా ఇక్కడ చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతున్న తొలి క్వాలిఫయర్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పది ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 86 పరుగులు చేసింది.
ముంబై:ఐపీఎల్-8 లో భాగంగా ఇక్కడ చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతున్న తొలి క్వాలిఫయర్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పది ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 86 పరుగులు చేసింది. ముంబై ఓపెనర్లు సిమ్మన్స్(50), పార్థీవ్ పటేల్(32)పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇందులో విజేతగా నిలిచే జట్టు నేరుగా ఫైనల్ కు ప్రవేశిస్తుంది.