ధోనితో కలసి నిక్‌ జోనస్‌ గేమ్‌ | MS Dhoni Plays Football With Nick Jonas | Sakshi
Sakshi News home page

Oct 1 2018 8:48 PM | Updated on Oct 1 2018 8:56 PM

MS Dhoni Plays Football With Nick Jonas - Sakshi

ముంబై : ఆసియా కప్‌ విజయానంతరం టీమిండియా ఆటగాళ్లంతా విశ్రాంతి తీసుకుంటుంటే మిస్టర్‌ కూల్‌ ధోని మాత్రం ఫుట్‌బాల్ ఆడుతూ ఎంజాయ్‌ చేస్తున్నాడు. ఫుట్‌బాల్‌ ఆడటం అంటే ధోనికి ఎంతో ఇష్టం అన్న విషయం తెలిసిందే. అయితే ఇది మాత్రం తన సంతోషం కోసం ఆడుతున్న మ్యాచ్‌ కాదు.. చారిటీ కోసం ఆడుతున్నది. ముంబైలో జరిగిన మ్యాచ్‌లో ‘ప్లేయింగ్‌ ఫర్‌ హ్యుమానిటీ’  పేరుతో బాలీవుడ్‌ సెలబ్రిటీలు ఆదిత్య రాయ్‌ కపూర్‌, కునాల్‌ కేము, ఇషాన్‌ కట్టర్‌, అమెరికన్‌ సింగర్‌, ప్రియాంక చోప్రా ఫియాన్సీ నిక్‌ జోనస్‌ ఫుట్‌బాల్‌ ఆడుతూ సందడి చేశారు. చారిటీ కోసం వీరితో పాటు జాయిన్‌ అయిన ధోని.. టీమ్‌ మెంబర్స్‌తో కలిసి ఫొటోలకు పోజులిచ్చాడు. ఈ ఫొటోలను ప్రియాంక చోప్రా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసి.. ‘బే ఇన్‌ బాంబే’ అంటూ క్యాప్షన్‌ జత చేశారు. కాగా ఆసియా కప్‌లో భాగంగా ధోని ఎన్నో రికార్డులు తన పేరిట లిఖించుకున్న సంగతి తెలిసిందే.

Bae in Bombae!! 😍 #friends #mumbai #football @nickjonas

A post shared by Priyanka Chopra (@priyankachopra) on

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement