కోల్ కతా: డిసెంబర్ లో యూఏఈలో టీమిండియా-పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య జరగాల్సిన ద్వైపాక్షిక సిరీస్ కు సంబంధించి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)తో చర్చలను తమ రాష్ట్రంలో జరుపుకోవచ్చంటూ భారత క్రికెట్ బోర్డు(బీసీసీఐ) కు పశ్చిమబెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆహ్వానం పలికారు. మరో రెండు నెలల్లో జరగాల్సిన ద్వైపాక్షిక సిరీస్ అంశంపై పాకిస్థాన్ తో క్రికెట్ బోర్డుతో చర్చలకు బీసీసీఐ సుముఖత వ్యక్తం చేయడంతో సోమవారం ముంబైలోని బోర్డు ప్రధాన కార్యాలయాన్ని శివసేన కార్యకర్తలు ముట్టడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముంబైలో చర్చలకు ఆయా బోర్డులకు విఘాతం కలిగితే.. కోల్ కతా నగరంలో భేటి కావొచ్చంటూ ఇరు క్రికెట్ బోర్డు పెద్దలకు మమత ట్విట్టర్ ద్వారా ఆహ్వనం పలికారు.
ఈ రోజు ఉదయం ఇండో - పాక్ సిరీస్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ శివసేన కార్యకర్తలు బీసీసీఐ కార్యాలయంలోకి దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. బీసీసీఐ ప్రెసిడెంట్ శశాంక్ మనోహర్ ఛాంబర్లోకి చొరబడిన శివసేన కార్యకర్తలు ఆయనతో వాగ్వాదానికి దిగి సిరీస్ పై చర్చలు వద్దంటూ ఆందోళన చేపట్టారు. దీనిలో భాగంగా ఇరు క్రికెట్ బోర్డుల మధ్య జరగాల్సిన సమావేశం తాత్కాలికంగా రద్దయ్యింది. ఇరుదేశాల క్రికెట్ బోర్డుల ఒప్పందం ప్రకారం 2015 నుంచి 2023 వరకూ ఆరు సిరీస్ లు జరగాల్సి ఉంది. 2007 తరువాత ఓ సిరీస్ లో భాగంగా 2012-13 వ సంవత్సరంలో భారత పర్యటనకు పాకిస్థాన్ వచ్చింది. ఆ తరువాత ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు జరగలేదు.
బీసీసీఐ-పీసీబీలకు సీఎం మమత ఆహ్వానం!
Published Mon, Oct 19 2015 5:35 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆదివారం రాహుల్ గాంధీ..
హోమ్ ఓటింగ్ ప్రారంభం
రాజకీయ లబ్ధి కోసమే దుష్ప్రచారం
నరేంద్ర మోదీ.. అమిత్ షా..
జిల్లాపై సీఎం రేవంత్రెడ్డి స్పష్టత ఇవ్వాలి
ఆలోచించి ఓటు వేయండి
కేటీఆర్.., హరీశ్రావు..
హెలీప్యాడ్ ఏర్పాటును పరిశీలించిన ఎమ్మెల్యే
జిల్లాల రద్దు లీకులపై సీఎం స్పందించాలి
ప్రమోషన్లు, బదిలీలు తక్షణమే చేపట్టాలి
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement