డబుల్స్‌ విజేత మలిష్క జంట | Malishka Pair Won Doubles Title | Sakshi
Sakshi News home page

డబుల్స్‌ విజేత మలిష్క జంట

Jul 21 2018 10:23 AM | Updated on Jul 21 2018 10:23 AM

Malishka Pair Won Doubles Title - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అఖిల భారత టెన్నిస్‌ సంఘం (ఐటా) సూపర్‌ సిరీస్‌ అండర్‌–12 టోర్నమెంట్‌లో తెలంగాణ అమ్మాయి కె. మలిష్క ఆకట్టుకుంది. గువాహటిలోని ఆల్‌ అస్సాం టెన్నిస్‌ కాంప్లెక్స్‌లో జరిగిన ఈ టోర్నీలో డబుల్స్‌ విభాగంలో విజేతగా నిలిచింది. శుక్రవారం జరిగిన బాలికల డబుల్స్‌ ఫైనల్లో మలిష్క– అనన్య జంట 6–3, 6–1తో స్నిగ్ధ–తాన్య (అస్సాం) జోడీపై గెలుపొందింది.

అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగిన ఈ జంట అంతకుముందు జరిగిన సెమీస్‌లో 7–5, 7–6 (7/5)తో టాప్‌ సీడ్‌ దుర్గాన్షి (ఢిల్లీ)–రిధి చౌదరి (ఏపీ) జోడీకి షాకిచ్చింది. క్వార్టర్స్‌లో 2–6, 6–4, 10–2తో నాలుగోసీడ్‌ సోహా సింగ్‌ (కర్ణాటక)–అస్మీ అడ్కర్‌ (మహారాష్ట్ర) జంటను ఓడించింది. పోటీల అనంతరం ఐటీఎఫ్‌ చీఫ్‌ రిఫరీ సురజిత్‌ బందోపాధ్యాయ్‌ విజేతలకు ట్రోఫీలను అందజేశారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement