కింగ్స్‌ ఎలెవన్‌ కెప్టెన్‌గా మ్యాక్స్‌వెల్‌ | Sakshi
Sakshi News home page

కింగ్స్‌ ఎలెవన్‌ కెప్టెన్‌గా మ్యాక్స్‌వెల్‌

Published Sat, Mar 11 2017 1:28 AM

కింగ్స్‌ ఎలెవన్‌ కెప్టెన్‌గా మ్యాక్స్‌వెల్‌

రాబోయే సీజన్‌ ఐపీఎల్‌–10లోనైనా జట్టు తలరాతని మార్చాలని కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ యాజమాన్యం సంకల్పించింది. అనుకున్నదే తడవుగా జట్టు సారథ్య బాధ్యతల నుంచి భారత ఓపెనర్‌ మురళీ విజయ్‌ని తప్పించి ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌కు కెప్టెన్సీని కట్టబెట్టింది.

ఐపీఎల్‌–9 సీజన్‌ మధ్యలో డేవిడ్‌ మిల్లర్‌ నుంచి మురళీ విజయ్‌ జట్టు పగ్గాలు స్వీకరించినప్పటికీ జట్టు ప్రదర్శన ఆశించిన రీతిలో లేదు. మొత్తం 14 మ్యాచ్‌ల్లో నాలుగు మాత్రమే గెలిచి పంజాబ్‌ వరుసగా రెండోసారి చివరి స్థానంలో నిలిచింది.

Advertisement
Advertisement