నానింగ్ (చైనా): క్వార్టర్ ఫైనల్ బెర్త్ తొలి లక్ష్యంగా సుదిర్మన్ కప్లో భారత జట్టు తమ పోరాటాన్ని ప్రారంభించనుంది. ప్రపంచ మిక్స్డ్ టీమ్ చాంపియన్షిప్ టోర్నమెంట్ అయిన సుదిర్మన్ కప్లో భారత్ రెండుసార్లు (2011, 2017లలో) క్వార్టర్ ఫైనల్ చేరుకుంది. అయితే ఆ రెండుసార్లు క్వార్టర్ ఫైనల్ అడ్డంకిని దాటలేకపోయింది. మంగళవారం జరిగే గ్రూప్–డి మ్యాచ్లో మలేసియాతో భారత్ ఆడనుంది. ఇదే గ్రూప్ తొలి మ్యాచ్లో చైనా చేతిలో మలేసియా ఓడిపోయింది. ఫలితంగా నేడు మలేసియాపై భారత్ గెలిస్తే నేరుగా క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశిస్తుంది. ఒకవేళ ఓడితే మాత్రం తదుపరి మ్యాచ్లో పటిష్టమైన చైనాపై భారత్ గెలవాల్సి ఉంటుంది. దిగ్గజ ఆటగాడు లీ చోంగ్ వీ లేకపోవడంతో మలేసియా జట్టు బలహీనంగా కనిపిస్తోంది. ఈ అవకాశాన్ని భారత్ సద్వినియోగం చేసుకోవాలి. అయితే భారత విజయావకాశాలు డబుల్స్ జోడీల ప్రదర్శనపై ఆధారపడి ఉంది.
పురుషుల సింగిల్స్లో కిడాంబి శ్రీకాంత్ లేదా సమీర్ వర్మ, మహిళల సింగిల్స్లో పీవీ సింధు లేదా సైనా నెహ్వాల్ బరిలోకి దిగి విజయం సాధిస్తే భారత్ 2–0తో ఆధిక్యంలోకి వెళ్తుంది. ఆ తర్వాత పురుషుల డబుల్స్, మహిళల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ మ్యాచ్ల్లో భారత్ ఒక్కటి నెగ్గినా విజయం ఖాయమవుతుంది. 13 మంది సభ్యులుగల భారత బృందానికి ఈసారి ఎనిమిదో సీడింగ్ లభించింది. 2018 కామన్వెల్త్ గేమ్స్లో మలేసియా జట్టుపై నెగ్గి భారత్ స్వర్ణ పతకాన్ని సాధించింది. అదే స్ఫూర్తితో ఈసారి కూడా భారత్ చెలరేగితే ముందంజ వేయడం ఖాయం. మలేసియాతో మ్యాచ్ అనంతరం బుధవారం జరిగే రెండో లీగ్ మ్యాచ్లో పదిసార్లు చాంపియన్ చైనాతో భారత్ ఆడుతుంది.
భారత జట్టు: కిడాంబి శ్రీకాంత్, సమీర్ వర్మ (పురుషుల సింగిల్స్), పీవీ సింధు, సైనా నెహ్వాల్ (మహిళల సింగిల్స్), సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి, సుమీత్ రెడ్డి, మను అత్రి, ప్రణవ్ చోప్రా (పురుషుల డబుల్స్), అశ్విని పొన్నప్ప, సిక్కి రెడ్డి, మేఘన, పూర్వీషా రామ్ (మహిళల డబుల్స్).
గెలిస్తే నాకౌట్ దశకు
Published Tue, May 21 2019 12:36 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాజ్యాంగ పరిరక్షణకు నడుం బిగించాలి
శాసీ్త్రయ దృక్పథం అలవర్చుకోవాలి
అక్రమ కేసులు పెడుతున్నారు..
మూడు నియోజకవర్గాలకు అదనపు ఈవీఎంలు
బడి.. దందా!
పలుచోట్ల వడగళ్లు
● ఎమ్మెల్యేలకు ప్రతిష్టాత్మకంగా పార్లమెంట్ ఎన్నికలు ● ప్రచారంపై దృష్టి పెట్టిన ప్రజాప్రతినిధులు ● అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత మారిన పరిస్థితులు ● అధికార కాంగ్రెస్లో చేరికలు ప్రభావం చూపేనా..?
‘దోస్త్’ సహాయ కేంద్రం ప్రారంభం
ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి
మెరుగైన వైద్య సేవలందించాలి●
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement