ఆనంద్‌కు మిశ్రమ ఫలితాలు | Indian Grandmaster Viswanathan | Sakshi
Sakshi News home page

ఆనంద్‌కు మిశ్రమ ఫలితాలు

Oct 11 2015 12:48 AM | Updated on Sep 3 2017 10:44 AM

ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి.

బెర్లిన్: ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. 15 రౌండ్‌లపాటు జరిగే ఈ మెగా ఈవెంట్‌లో ఆనంద్‌కు తొలి నాలుగు రౌండ్‌లలో రెండు విజయాలు లభించగా... ఒక ‘డ్రా’... మరో ఓటమి ఎదురైంది. కాటరీనా లాగ్నో (రష్యా)తో జరిగిన తొలి రౌండ్ గేమ్‌ను ఆనంద్ 32 ఎత్తుల్లో... అలెగ్జాండర్ ఒనిస్‌చుక్ (అమెరికా)తో జరిగిన రెండో రౌండ్ గేమ్‌ను 53 ఎత్తుల్లో గెలిచాడు. అయితే సలీమ్ సలెహ్ (యూఏఈ)తో జరిగిన మూడో రౌండ్ గేమ్‌ను ఆనంద్ 41 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకొని... డానిల్ దుబోవ్ (రష్యా)తో జరిగిన నాలుగో రౌండ్ గేమ్‌లో 42 ఎత్తుల్లో ఓటమి చవిచూశాడు. మరోవైపు భారత్‌కే చెందిన విదిత్ సంతోషి గుజరాతి మూడు గేముల్లో నెగ్గి, మరో గేమ్‌ను ‘డ్రా’ చేసుకున్నాడు. గాదిర్ (అజర్‌బైజాన్), వోలోకితిన్ (ఉక్రెయిన్), గ్రిస్‌చుక్ (రష్యా)లపై నెగ్గిన విదిత్... నెపోమ్‌నియాచి (రష్యా)తో జరిగిన గేమ్‌ను ‘డ్రా’ చేసుకున్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement