దక్షిణాఫ్రికా ‘ఎ’ 294/7

India A-South Africa A headed for a tame draw - Sakshi

బెంగళూరు: భారత్‌ ‘ఎ’, దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్ల మధ్య జరుగుతున్న రెండో అనధికారిక టెస్టు ‘డ్రా’ దిశగా పయనిస్తోంది. కీలకమైన మూడో రోజు ఆటకు వర్షం అంతరాయం కలిగించింది. 219/3 ఓవర్‌నైట్‌ స్కోరుతో ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా ‘ఎ’ వర్షం కారణంగా ఆట నిలిచే సమయానికి 92.3 ఓవర్లలో 7 వికెట్లకు 294 పరుగులు చేసింది. ఓవర్‌నైట్‌ బ్యాట్స్‌మెన్‌  డసెన్‌ (22; 2 ఫోర్లు), రూడీ సెకండ్‌ (47; 7 ఫోర్లు)లను భారత బౌలర్‌ అంకిత్‌ రాజ్‌పుత్‌ ఔట్‌ చేశాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్టు భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోరుకు ఇంకా 51 పరుగులు వెనుకంజలోనే ఉంది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top