ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ ఎం.ఆర్.లలిత్బాబు పార్శ్వనాథ్ అంతర్జాతీయ గ్రాండ్మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో శుభారంభం చేశాడు.
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ ఎం.ఆర్.లలిత్బాబు పార్శ్వనాథ్ అంతర్జాతీయ గ్రాండ్మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో శుభారంభం చేశాడు. లుడ్లా క్యాజిల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో జరుగుతున్న ఈ ఈవెంట్లో శుక్రవారం నాటి రెండో రౌండ్లో లలిత్బాబు ... అంతర్జాతీయ మాస్టర్ ఎస్.నితిన్ (1)పై విజయం సాధించాడు.
అంతకుముందు జరిగిన తొలి రౌండ్లో అతను... భారత ఆటగాడు అనూప్ దేశ్ముఖ్ను ఓడించాడు. తాజా విజయాలతో అతను 2 పాయింట్లతో ఉమ్మడిగా ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. తొలిరౌండ్లో గెలిచిన హర్ష భరతకోఠి (1.5).... ఫ్రాంకోయిస్ ఫార్గెర్తో జరిగిన రెండో రౌండ్ గేమ్ను డ్రా చేసుకున్నాడు. శనివారం జరిగే మూడో రౌండ్ పోరులో లలిత్బాబు... రాజేశ్తో తలపడతాడు.