సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘంలో జరిగిన నిధుల దుర్వినియోగం, టిక్కెట్ల కుంభకోణం తదితర అంశాలపై ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాల మేరకు దర్యాప్తు చేస్తున్న బృందంలోని అధికారులెవ్వరినీ బదిలీ చెయ్యొద్దని హైకోర్టు ఏసీబీ డెరైక్టర్ జనరల్ను బుధవారం ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహనరావు ఉత్తర్వులు జారీ చేశారు.
అంతేకాక ఈ మొత్తం వ్యవహారంలో ఫిబ్రవరి 28 నాటికి దర్యాప్తు పూర్తి చేస్తామని మౌఖికంగా చెప్పొద్దని, రాతపూర్వకంగా ఓ అఫిడవిట్ను కోర్టు ముందుంచాలని ఏసీబీ అధికారులను న్యాయమూర్తి ఆదేశించారు. హెచ్సీఏలో నిధుల దుర్వినియోగం, ఇతర అవకతవకలపై సాగర్ క్లబ్ కార్యదర్శి సి.బాబురావ్ సాగర్ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో 2011లో ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదును పరిశీలించిన కోర్టు, ఈ మొత్తం వ్యవహారంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని, దర్యాప్తు నివేదికను తమ ముందుంచాలని ఏసీబీ అధికారులను ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు ఏసీబీ అధికారులు 2011 ఏప్రిల్ 13న... 22 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఇప్పటి వరకు దర్యాప్తులో ఎటువంటి పురోగతి లేదని, నిందితుల్లో ఏ ఒక్కరినీ కూడా అరెస్ట్ చేయలేదని, ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తును పర్యవేక్షించాలని హైకోర్టును కోరుతు బాబూరావ్సాగర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని బుధవారం జస్టిస్ రామ్మోహనరావు విచారించారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న అధికారులెవ్వరినీ కూడా బదిలీ చేయవద్దని స్పష్టం చేశారు. కేసును తదుపరి విచారణ నిమిత్తం మార్చి 10కి వాయిదా వేశారు.
దర్యాప్తు అధికారులెవ్వరినీ బదిలీ చేయవద్దు...
Published Thu, Jan 30 2014 1:15 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- క్యాన్సర్తో పోరాటం.. ఇప్పుడేవీ సరిగా గుర్తుండట్లేదు: హీరోయిన్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
Advertisement