ఎలాంటి డ్రెస్సులు వేయాలో తెలీదా?

Dhoni Wife Sakshi Slammed for Inappropriate Outfit

టీమిండియా సీనియర్‌ క్రికెటర్‌ ఎంఎస్‌ ధోనీ భార్య సాక్షి ధోనీపై సోషల్‌ మీడియా వేదికగా సెటైర్ల వర్షం కురుస్తోంది. సాక్షి ఈ మధ్యే తన బెస్ట్‌ ఫ్రెండ్‌ పూర్ణ పటేల్‌ సంగీత్‌ కార్యక్రమానికి ఈ మధ్య హాజరయ్యారు. అందుకోసం మనీష్‌ మల్హోత్రా డిజైన్‌ చేసిన డ్రెస్సును ఆమె ధరించారు. అయితే ఆ డ్రెస్సే సోషల్‌ మీడియాలో ఆమెపై విమర్శలు గుప్పించేలా చేసింది. 

‘ఎలాంటి డ్రెస్సులు వేయాలో తెలీదా? అది అవసరమా?.. సెలబ్రిటీ భార్య అయినంత మాత్రానా ఇలాంటివి వేస్తావా? నీకలు డ్రెస్సింగ్‌ సెన్సే లేదు’ ఇలాంటి కామెంట్లు వచ్చి పడుతున్నాయి. అయితే ఈ క్రమంలో సాక్షికి సపోర్ట్‌గా పలువురు నిలుస్తున్నారు. ఆ ఫోటోలో ఎలాంటి తప్పు లేదని.. ట్రోల్‌ చేసే వాళ్ల ఆలోచనలే తప్పుగా ఉన్నాయని కామెంట్లు చేస్తున్నారు. అయితే భర్త ధోనీలాగే కూల్‌ అని పేరున్న సాక్షి.. ఆయా కామెంట్లకు రియాక్ట్‌ కాకుండా ఉండిపోయారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top