కింగ్స్‌ పంజాబ్‌ టార్గెట్‌ 161 | Dhoni flourish gives CSK 160 Against Kings Punjab | Sakshi
Sakshi News home page

కింగ్స్‌ పంజాబ్‌ టార్గెట్‌ 161

Apr 6 2019 5:53 PM | Updated on Apr 6 2019 6:43 PM

Dhoni flourish gives CSK 160 Against Kings Punjab - Sakshi

చెన్నై: ఐపీఎల్‌ సీజన్‌ 12లో భాగంగా ఇక్కడ కింగ్స్‌ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ 161 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌ తీసుకున్న చెన్నై ఇన్నింగ్స్‌ను షేన్‌ వాట్సన్‌, డుప్లెసిస్‌లు ఆరంభించారు. వీరిద్దరూ 56 పరుగులు భాగస్వామ్యాన్ని జత చేసిన తర్వాత తొలి వికెట్‌గా వాట్సన్‌(26;24 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) ఔటయ్యాడు. ఆ తరుణంలో డుప్లెసిస్‌కు జత కలిసిన సురేశ్‌ రైనా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఈ క్రమంలోనే డుప్లెసిస్‌ హాఫ్‌ సెంచరీ సాధించాడు. ఈ జోడి 44 పరుగులు జత చేసిన తర్వాత డుప్లెసిస్‌(54; 38 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లు) రెండో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు.

అశ్విన్‌ బౌలింగ్‌లో మిల్లర్‌కు క్యాచ్‌ ఇచ్చి డుప్లెసిస్‌ ఔటయ్యాడు. ఆ తదుపరి  బంతికి రైనా(17) కూడా ఔట్‌ కావడంతో సీఎస్‌కే 100 పరుగుల వద్ద మూడో వికెట్‌ను కోల్పోయింది. ఆపై అంబటి రాయుడు-ఎంఎస్‌ ధోనిల జోడి సమయోచితంగా బ్యాటింగ్‌ చేసింది. ధోని(37 నాటౌట్‌; 23 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌), అంబటి రాయుడు(21 నాటౌట్‌; 15 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్స్‌)లు 60 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేయడంతో సీఎస్‌కే నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. కింగ్స్‌ పంజాబ్‌ బౌలర్లలో అశ్విన్‌ మూడు వికెట్లు సాధించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement