ఢిల్లీ: తమ పట్ల నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించిన కేంద్ర ప్రభుత్వంపై భారత బధిర ఒలింపిక్స్ బృందం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. టర్కీలో జరిగిన డెఫ్లింపిక్స్ లో ఐదు పతకాలను సాధించి స్వదేశానికి చేరినా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి స్వాగతం లేకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
క్రీడాకారులు, సహాయ సిబ్బంది సహా మొత్తం 46తో కూడిన బధిర ఒలింపిక్స్ బృందం మంగళవారం ఢిల్లీ ఎయిర్ పోర్ట్ కు చేరుకుంది. అయితే అక్కడ వారికి స్వాగత ఏర్పాట్లు కనిపించకపోగా, కనీసం పలకరించే వారు కూడా ఎవరూ లేరు. దాంతో తీవ్ర నిరాశ చెందిన వారు ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. గతంలో ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్ లుకు వెళ్లిన వారికి ఘనమైన ఆహ్వానం పలికిన ప్రభుత్వం.. ఇప్పుడు తమ పట్ల ఎందుకు వివక్ష చూపుతుందంటూ మండిపడ్డారు. దేశం కోసం తాము సాధించిన పతకాలు తమకు అక్కర్లేదని, వాటిని తిరిగి ఇచ్చేస్తామన్నారు. తాము ఎప్పుడు వచ్చేది క్రీడామంత్రికి ముందుగానే సమాచారం ఇచ్చినా, తమను కనీసం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ ఎయిర్ పోర్ట్ నుంచి వెళ్లేదిలేదంటూ అక్కడే బైఠాయించారు.
ఈ సందర్భంగా అఖిల భారత బధిర కౌన్సిల్ ప్రతినిధి కేతన్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు.' ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్ లో పతకాలు సాధించిన క్రీడాకారులు స్వదేశం చేరుకున్నప్పుడు సంబరాలు చేసుకున్నాం. ఇప్పుడు మన క్రీడాకారులు ఐదు పతకాలతో తిరిగి వచ్చారు. మరి వీరు క్రీడాకారులు కాదా?, బధిర క్రీడాకారులపై చిన్నచూపు ఎందుకు?, వారికిచ్చిన గౌరవం మాకేది?, క్రీడల మంత్రి విజయ్ గోయల్ కు మా రాకపై సమాచారం ఇచ్చినా ఎటువంటి స్పందనా రాకపోవడం బాధగా ఉంది. ఇక మాకు వచ్చిన పతకాలు ఎందుకు?'అంటూ కేతన్ షా ప్రశ్నించారు. అయితే దీనిపై విజయ్ గోయల్ స్పందించారు. అనారోగ్యంతో రాలేకపోయానని వివరణ ఇచ్చుకునే యత్నం చేశారు. భారత క్రీడా బృందానికి కర్నూలు వాసి జఫ్రిన్ నేతృత్వం వహించారు.
వారికిచ్చిన గౌరవం మాకేది?
Published Tue, Aug 1 2017 2:01 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
ఒక్కరోజులోనే రూ.800 కోట్లు నష్టపోయిన రేఖా ఝున్ఝున్వాలా
సీఎం జగన్ కోసం రాజానగరం సిద్ధం(ఫొటోలు)
ఓటర్లపై తేనెటీగల దాడి.. ఎనిమిదిమందికి గాయాలు!
'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
టీడీపీ నేతల దౌర్జన్యాలు అరికట్టాలి
'ఇరానీ చాయ్'ని పరిచయం చేసిందెవరో తెలుసా! ది బెస్ట్ ఎక్కడంటే..
కేజ్రీవాల్కు ఎందుకు బెయిల్ ఇవ్వొద్దు : ఈడీని ప్రశ్నించిన సుప్రీం
టీడీపీ గూండాగిరి
తప్పక చదవండి
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నారా? హార్దిక్ సమాధానం ఇదే!
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వారందరి జీవితాలను మార్చేసిన 'ఆర్య'కు 20 ఏళ్లు
- వైజాగ్ మాల్యా.. వంశీ!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- LS Elections 3rd Phase: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్
Advertisement