స్వదేశం చేరుకున్న మొదటి క్రికెటర్‌ | Cricketer Rohit Sharma has Returned to India with his Family | Sakshi
Sakshi News home page

స్వదేశం చేరుకున్న మొదటి క్రికెటర్‌

Jul 13 2019 4:25 PM | Updated on Jul 13 2019 4:31 PM

Cricketer Rohit Sharma has Returned to India with his Family - Sakshi

సాక్షి, ముంబై: ఇంగ్లాండ్‌లో జరిగిన క్రికెట్‌ వరల్డ్‌ కప్‌లో టీమిండియా సెమీస్‌లో న్యూజిలాండ్‌ చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే.  ఈ నేపథ్యంలో అందరి కంటే ముందు ఓపెనర్‌ రోహిత్‌ శర్మ ఇండియాకు వచ్చేశాడు. శనివారం తెల్లవారు జామున ముంబై విమానాశ్రయానికి చేరుకున్న రోహిత్‌ కారులో తన నివాసానికి చేరుకున్నారు. ఆయన వెంట భార్య రితిక, కూతురు సమైరా ఉన్నారు.

ఈ  ప్రపంచకప్‌లో రోహిత్‌ శర్మ 9 మ్యాచ్‌ల్లో 648 పరుగులు చేసి టాప్‌ బ్యాట్స్‌మన్‌గా కొనసాగుతున్నాడు. ఐదు సెంచరీలతో రోహిత్‌ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్‌ మ్యాచ్‌లో కేవలం ఒక్క పరుగు మాత్రమే సాధించి నిరాశపరిచాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement