స్థానిక చిదంబరం స్టేడియంలో జరిగే మ్యాచ్లను చూసే వారెవరికైనా మూడు ఖాళీగా ఉండే స్టాండ్స్ కనిపించే ఉంటాయి.
చెన్నై: స్థానిక చిదంబరం స్టేడియంలో జరిగే మ్యాచ్లను చూసే వారెవరికైనా మూడు ఖాళీగా ఉండే స్టాండ్స్ కనిపించే ఉంటాయి. కార్పొరేషన్తో వివాదం కారణంగా వీటిలో ప్రేక్షకులను అనుమతించడం లేదు. ఇప్పుడు ఈ ఖాళీ స్టాండ్స్ కారణంగా టి20 ప్రపంచకప్ మ్యాచ్లను చెన్నై కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. ఖాళీ స్టాండ్స్తో మ్యాచ్లను నిర్వహించేది లేదని ఐసీసీ తెగేసి చెప్పింది.