జింబాబ్వేతో జరిగిన మూడు వన్డేల సిరీస్ను బంగ్లాదేశ్ జట్టు క్లీన్స్వీప్ చేసింది.
ఢాకా: జింబాబ్వేతో జరిగిన మూడు వన్డేల సిరీస్ను బంగ్లాదేశ్ జట్టు క్లీన్స్వీప్ చేసింది. బుధవారం చివరిదైన మూడో వన్డేలోనూ ఆతిథ్య జట్టు 61 పరుగుల తేడాతో నెగ్గింది. దీంతో 3-0తో సిరీస్ దక్కించుకుంది. ముందుగా బ్యాటింగ్కు దిగిన బంగ్లా 50 ఓవర్లలో 9 వికెట్లకు 276 పరుగులు చేసింది.
తమీమ్ ఇక్బాల్ (98 బంతుల్లో 73; 7 ఫోర్లు; 1 సిక్స్), కయేస్ (95 బంతుల్లో 73; 6 ఫోర్లు; 4 సిక్సర్లు), మహ్ముదుల్లా (40 బంతుల్లో 52; 5 ఫోర్లు; 1 సిక్స్) అర్ధ సెంచరీలు సాధించారు. అనంతరం జింబాబ్వేను పేసర్ ముస్తాఫిజుర్ (5/34) వణికించాడు. దీంతో 43.3 ఓవర్లలో 215 పరుగులకు ఆలౌట్ అయ్యింది.