
ఆసీస్ జోరుకు బ్రేక్.. పరుగు తేడాతో 2 వికెట్లు
ఆస్ట్రేలియా జోరుకు బ్రేక్ పడింది. కీలక సమయంలో భారత బౌలర్లు సత్తాచాటారు.
సిడ్నీ: ఆస్ట్రేలియా జోరుకు బ్రేక్ పడింది. కీలక సమయంలో భారత బౌలర్లు సత్తాచాటారు. పరుగు తేడాతో రెండు కీలక వికెట్లు పడగొట్టి కంగారూలకు కళ్లెం వేశారు. 232 పరుగులు వద్ద అశ్విన్.. మ్యాక్స్వెల్ను అవుట్ చేశాడు. మ్యాక్స్వెల్ రహానెకు క్యాచిచ్చాడు. భారత పేసర్ ఉమేష్ యాదవ్ ఆ వెంటనే ఫించ్ను పెవిలియన్ బాట పట్టించాడు. ఫించ్.. ధావన్కు దొరికిపోయాడు. ప్రపంచ కప్ సెమీస్ పోరులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ 40 ఓవర్లలో 4 వికెట్లకు 239 పరుగులు చేశారు.