ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీ విజేత అపురూప్‌ | apuroop wins mens open tennis title | Sakshi
Sakshi News home page

ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీ విజేత అపురూప్‌

Dec 14 2017 12:28 PM | Updated on Dec 14 2017 12:29 PM

apuroop wins mens open tennis title - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: స్పెయిన్‌లో జరిగిన పురుషుల ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ యువ ఆటగాడు పి. అపురూప్‌ రెడ్డి విజేతగా నిలిచాడు. ఆరు వారాల పాటు శిక్షణ కోసం బార్సిలోనాకు వెళ్లిన అపురూప్‌ ఈ సందర్భంగా జరిగిన ఓపెన్‌ టోర్నీలో చాంపియన్‌ అయ్యాడు. పలు దేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్న ఈ టోర్నీలో ఫైనల్లో అపురూప్‌ 6–3, 2–6, 6–4తో ఎంజో బ్లాగ్‌వినాట్‌ (ఫ్రాన్స్‌)పై గెలిచాడు. సెమీస్‌లో అపురూప్‌ 3–6, 6–3, 10–4తో మార్క్‌ గార్డెనో రస్కో (స్పెయిన్‌)పై, క్వార్టర్‌ ఫైనల్లో 7–6 (8/6), 6–4తో జూడీపై, రెండో రౌండ్‌లో 6–1, 6–0తో బెన్‌ వులియామి (బ్రిటన్‌)పై, తొలి రౌండ్‌లో 7–5, 6–0తో నికితా ప్లిస్‌చికోవ్‌ (రష్యా)పై విజయం సాధించాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement