
ఆకుల శ్రీజ
రాంచీ: జాతీయ సీనియర్ టేబుల్ టెన్నిస్ చాంపియన్షిప్లో ఆర్బీఐకు ప్రాతి నిధ్యం వహించిన తెలంగాణ క్రీడాకారిణి ఆకుల శ్రీజ స్వర్ణ పతకాన్ని సాధించింది. మిక్స్డ్ డబుల్స్ విభాగం ఫైనల్లో శ్రీజ–రాజ్ మోండల్ (ఆర్బీఐ) ద్వయం 3–2తో ఆకాశ్–అంకిత (బెంగాల్) జోడీపై గెలిచింది. పురుషుల సింగిల్స్లో శరత్ కమల్ ఎనిమిదోసారి విజేతగా నిలిచి కమలేశ్ మెహతా పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు.