జర్మనీలో ఆట మొదలైంది 

After Two Months Football Game Started In Germany - Sakshi

బెర్లిన్‌: దాదాపు రెండు నెలల విరామం అనంతరం యూరప్‌లో తిరిగి ఫుట్‌బాల్‌ ఆట మొదలైంది. కరోనా విజృంభణతో జర్మనీలో ఆగిపోయిన బుండెస్‌లిగా 2019–2020 సీజన్‌ శనివారం ప్రారంభమైంది. దాంతో యూరప్‌లో ఆరంభమైన తొలి మేజర్‌ టోర్నీగా బుండెస్‌లిగా నిలిచింది. కరోనా పూర్తిగా అదుపులోకి రాకపోవడంతో సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లను ప్రేక్షకులు లేకుండానే నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. అంతేకాకుండా ఆటగాళ్లను, సిబ్బందిని ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ తగు జాగ్రత్తలు తీసుకుంటామని జర్మనీ ఫుట్‌బాల్‌లీగ్‌ ప్రభుత్వానికి తెలిపింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top