జాతీయ ట్రాక్ సైక్లింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ కుర్రాడు అభినందన్ సత్తా చాటాడు.
సాక్షి, హైదరాబాద్: జాతీయ ట్రాక్ సైక్లింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ కుర్రాడు అభినందన్ సత్తా చాటాడు. కేరళలోని త్రివేండ్రం లో జరుగుతోన్న ఈ పోటీల్లో ఎలైట్ మెన్ 15కి.మీ స్క్రాచ్ రేసులో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించాడు. ప్రస్తుతం అభినందన్ దక్షిణ మధ్య రైల్వేలో టీసీగా పనిచేస్తున్నాడు.