breaking news
abhinandan
-
అభినందన్ను బంధించానన్న.. పాక్ ఆర్మీ అధికారి మృతి
న్యూఢిల్లీ: నాటి పుల్వామా ఉగ్రవాద దాడి(2019) తదనంతర పరిణామాలలో అప్పటి భారత వైమానిక దళం వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ నేషనల్ హీరోగా అందరి అభినందనలు అందుకున్నారు. అప్పట్లో ఆయనను బంధించానని చెప్పుకున్న పాకిస్తాన్ అధికారి మేజర్ మోయిజ్ అబ్బాస్ తాజాగా పాక్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతిచెందాడు.పాకిస్తాన్ సైన్యంలో మేజర్గా పనిచేస్తున్న మోయిజ్ అబ్బాస్ షా(37)దక్షిణ వజీరిస్తాన్లో తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్ (టీటీపీ)తో జరిగిన కాల్పుల్లో మృతిచెందాడు. ఈయన ఎలైట్ స్పెషల్ సర్వీస్ గ్రూప్ (ఎస్ఎస్జీ)లో పనిచేస్తున్నాడు. పాకిస్తాన్ సైన్యం విడుదల చేసిన ఒక ప్రకటనలోని వివరాల ప్రకారం లాన్స్ నాయక్ జిబ్రానుల్లాతో కలిసి ఉగ్రవాద నిరోధక ఆపరేషన్కు నాయకత్వం వహిస్తున్న అబ్బాస్ షా కాల్పుల్లో మృతిచెందాడు.ఒకప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వానికి అండగా నిలిచిన టీటీపీ ఇప్పుడు పాక్ భద్రతా సిబ్బంది, పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతూ ప్రభుత్వానికే ముప్పుగా పరిణమించింది. 2019లో బాలకోట్ వైమానిక దాడుల తర్వాత ప్రతీకార వైమానిక ఆపరేషన్లో పాల్గొన్న అభినందన్ మిగ్ 21 బైసన్ జెట్ను నడుపుతూ, పాకిస్తాన్ వైమానిక దళ జెట్లతో తలపడ్డాడు. అయితే అభినందన్ విమానం అకస్మాత్తుగా కూలిపోయింది. దీంతో అభినందన్ను పాకిస్తాన్ సైన్యం పట్టుకుంది.ఇది కూడా చదవండి: అగ్నిపర్వతంలో అదృశ్యం.. విగతజీవిగా పర్యాటకురాలు -
48 గంటలపాటు అంటిపెట్టుకొని ఉంది
సిమ్లా: ట్రెక్కింగ్లో భాగంగా పర్వతారోహణకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన యువతీయువకుల జాడను కనిపెట్టడంతో వారి పెంపుడు శునకం ఎంతగానో సాయపడింది. దాదాపు 48 గంటలపాటు అది అక్కడే ఉండి అరుస్తూ సాయం కోసం ఎవరైనా వస్తారేమోనని ఎదురుచూసింది. హిమాచల్ ప్రదేశ్లోని బిర్ బిల్లింగ్లో ఈ ఘటన జరిగింది. పంజాబ్లోని పఠాన్కోట్కు చెందిన 30 ఏళ్ల అభినందన్ గుప్తా, మహారాష్ట్రకు చెందిన 26 ఏళ్ల ప్రణీత వాలా సోమవారం బిర్ బిల్లింగ్ వద్ద ట్రెక్కింగ్కు బయల్దేరారు. ట్రెక్కింగ్ చేసి తిరుగుపయనంలో కిందకు దిగి వస్తూ ప్రమాదవశాత్తు లోయలో పడిపోయారు. అపస్మారకస్థితిలో గంటలకొద్దీ సమయం మంచులో కూరుకుపోవడంతో ప్రాణాలు కోల్పోయారు. ట్రెక్కింగ్ వేళ వీరితోపాటు పెంపుడు శునకం వెంట వచి్చంది. వీరు పడిపోవడంతో గమనించి ఘటనాస్థలికి పరుగున వచ్చింది. 48 గంటలపాటు అక్కడే సాయం కోసం అరుస్తూ నిల్చుంది. గాలిస్తున్న సహాయక బృందాలు ఎట్టకేలకు వీరి జాడను గుర్తించాయి. ఆ ప్రాంతంలో జర్మన్ షెపర్డ్ జాతి శునకం ఒకటి ఆపకుండా అరుస్తుండటంతో అటుగా వెళ్లి వీరి జాడను కనిపెట్టగలిగామని సహాయక బృందం తెలిపింది. -
'అభినందన'లు
యశవంతపుర: శతృదేశంపై అపార ధైర్యసాహసాలతో వైమానిక దాడి జరిపిన వాయుసేన పైలట్ అభినందన్కు గు ర్తుగా తమ బిడ్డలకు ఆయన పేరే పెట్టుకుని మురిసిపోతున్నారు తల్లిదండ్రులు. బాగలకోట జిల్లా ముధోళ్ పట్టణంలో జనతా ప్లాట్కు చెందిన రైతు సిద్ధ అంబిగేర, కమల దంపతులకు సోమవారం మగబిడ్డ జన్మించాడు. చిన్నారికి అభినందన్ అని నామకరణం చేశారు. ఈమె అభినందన : బాగలకోట జిల్లా ఇళకల్కు చెందిన అరవింద్ జమఖండి కూతురికి అభినందనగా నామకరణం చేశారు. వింగ్ కమాండర్ గౌరవార్థం ఈ పేరు పెట్టుకున్నట్లు తెలిపారు. -
వాఘా వద్ద భద్రత కట్టుదిట్టం
-
భారత్ పాకిస్ధాన్ మధ్య యుద్ధ మేఘాలు
-
పాక్ విడుదల చేసిన వీడియో..!
-
అభినందన్కు కాంస్యం
సాక్షి, హైదరాబాద్: జాతీయ ట్రాక్ సైక్లింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ కుర్రాడు అభినందన్ సత్తా చాటాడు. కేరళలోని త్రివేండ్రం లో జరుగుతోన్న ఈ పోటీల్లో ఎలైట్ మెన్ 15కి.మీ స్క్రాచ్ రేసులో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించాడు. ప్రస్తుతం అభినందన్ దక్షిణ మధ్య రైల్వేలో టీసీగా పనిచేస్తున్నాడు.