వేములవాడ: వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి గుడిచెరువులో శివద్వీపం నిర్మించేందుకు వీటీడీఏ నిర్ణయించింది. వేములవాడ ఆలయ అభివృద్ధి అథారిటీ(వీటీడీఏ) వైస్ చైర్మన్ ఎం.పురుషోత్తంరెడ్డి అధ్యక్షతన శనివారం హైదరాబాద్లో నాలుగు గంటలపాటు సమావేశం నిర్వహించారు. సీఎం కేసీఆర్ వేములవాడలో రెండు పర్యాయాలు పర్యటించి వెళ్లాక రాజన్న గుడి, నాంపల్లిగుట్ట, పట్టణ అభివృద్ధికి ప్రత్యేకంగా వీటీడీఏ ఏర్పాటు చేశారు. ఇందుకోసం రూ.400 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేశారు. ఓ పర్యాయం శృంగేరి పీఠాధిపతి అనుమతి తీసుకున్నారు. వీటిపై రూపొందించిన పవర్పాయింట్ ప్రజెంటేషన్ను కమిటీ పరిశీలించింది.
రాజన్నగుడి అభివృద్ధి కోసం 35 ఎకరాల్లో పనులు చేపట్టాలని, గుడిచెరువులోని 9 ఎకరాల్లో శివద్వీపం ఏర్పాటు చేసి శివుని భారీ విగ్రహం నెలకొల్పాలని, కట్టకింద బస్టాండ్ను రైల్వేస్టేషన్తో అనుసంధానించాలని, అక్కడి నుంచి భక్తులు నేరుగా ఆలయంలోకి వచ్చేందుకు ర్యాంపు ఏర్పాటు చేయాలని, బద్ధిపోచమ్మ ఆలయంలో రూ.20 కోట్ల వ్యయంతో బోనాల మంటపం నిర్మించాలని, సంకెపల్లి వద్ద చెక్డ్యాం నిర్మించి పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దాలని తీర్మానించారు.
గుడిచెరువులో ఏడాదిపొడవునా గోదావరి జలాలు అందుబాటులో ఉండేలా రూ.17 కోట్ల వ్యయంతో మిడ్మానేరు డెడ్స్టోరేజీ నుంచి నీటిని పంపింగ్ చేయాలని నిర్ణయించారు. తుది నివేదికను త్వరలో సీఎం కేసీఆర్కు సమర్పించాలని భావిస్తున్నారు. సమావేశంలో ఎమ్మెల్యే రమేశ్బాబు, వీటీడీఏ సెక్రటరీ భుజంగరావు, ఈవో దూస రాజేశ్వర్, ఈఈ రాజయ్య, డీఈ రఘునందన్, ఆర్కిటెక్ నాగరాజు, ముక్తేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. కాగా, నిర్వాసితుల కోసం తొలివిడత పరిహారంగా ఆదివారం రూ.6.38 కోట్లు పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే రమేశ్బాబు తెలిపారు.
రాజన్న గుడిచెరువులో శివద్వీపం
Published Sun, Jan 21 2018 3:08 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement