చంద్రబాబుది ముమ్మాటికీ 420 దీక్షే..
సాక్షి, కర్నూలు : సీఎం చంద్రబాబు తీరుపై వైఎస్సార్ సీపీ నేత బీవై రామయ్య మండిపడ్డారు. చంద్రబాబుది ముమ్మాటికీ 420 దీక్షే అని ఆయన విమర్శించారు. దీక్ష పేరుతో చంద్రబాబు మరో కుట్రకు తెరలేపారని పేర్కొన్నారు. గురువారం ఆయన విలేకరులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుట్రలు, కుతంత్రాలతో హోదా రాకుండా చంద్రబాబు అడ్డుకున్నారని బీవై రామయ్య ధ్వజమెత్తారు. అంతేకాక ఇప్పుడు మల్లీ ప్రజలను మభ్య పెట్టుందుకు కొంగజపం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ఎంపీల రాజీనామాలు, ఆమరణ దీక్షకు కలిసిరాని చంద్రబాబు.. ఇప్పుడు మాత్రం ఒకరోజు దీక్ష చేస్తాననడం హాస్యాస్పదమని బీవై రామయ్య ఎద్దేవా చేశారు.
మరిన్ని వార్తలు