కాంగ్రెస్‌ కూటమిలో చేరితే రాజీనామా చేస్తా

Will Quit Party If AAP Joins With Congress HS Phoolka Said - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ కూటమిలో ఆమ్‌ ఆద్మీ పార్టీ చేరితే పార్టీకి రాజీనామా చేస్తానని ఆప్‌ ఎమ్మెల్యే, సీనియర్‌ న్యాయవాది హెచ్‌ ఎస్‌ పుల్కా తెలిపారు. ఈ మేరకు ఆయన ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ను బహిరంగంగానే హెచ్చరించారు. కాంగ్రెస్‌కు తాను వ్యతిరేకమని తేల్చి చెప్పారు. 1984లో సిక్కులపై కాంగ్రెస్‌ జరిపిన దాడులు త్రీవమైన విషయమన్నారు. ఆ కేసు తనకు చాలా ముఖ్యమైనదని చెప్పారు. ఆప్‌ కనుక కాంగ్రెస్‌ కూటమిలో చేరితే తాను పార్టీకి రాజీనామా చేస్తానని, ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. 

కర్ణాటక ముఖ్యమంత్రి కుమార స్వామి ప్రమాణ స్వీకారానికి అరవింద్‌ కేజ్రివాల్‌ హాజరైన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీలతో కలిసి కేజ్రీవాల్‌ వేదిక పంచుకున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే పుల్కా ఈ హెచ్చరిక చేశారు. 

1984లో అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ హత్య అనంతరం సిక్కులపై దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో వేలాదిమంది సిక్కులు బాధితులయ్యారు. వారికి న్యాయం చేయడానికి పుల్కా పోరాటం చేశారు. ఆయన గత ఏడాది పంజాబ్‌లో జరిగిన ఎన్నికల్లో  ఆమ్ ఆద్మీ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు.
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top