కన్నా! మీరు సుజనాకు అమ్ముడుపోయారా?

Vijaya Sai Reddy Reacts On Kanna Lakshmi Narayana Comments - Sakshi

సాక్షి, అమరావతి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ ఇమేజ్‌ పెరిగినా రాష్ట్రంలో ఆ పార్టీ ఎదగకపోవడానికి చంద్రబాబుకు అమ్ముడుపోయిన కన్నా లాంటివారే కారణమని’ సోమవారం ట్వీట్‌ చేశారు. ‘బాబు ప్యాకేజీ ఆఫర్‌ అవసాన దశలో ఉన్నవారినీ లేపి కూర్చోపెడుతుంది. మొదటి నుంచి బీజేపీలో ఉన్నవారు... కన్నాలాంటి జంబూకాలను వదిలించుకోవాలి’ అని సూచించారు. 

‘మళ్లీ అడుగుతున్నా...కన్నా! మీరు సుజనాకు అమ్ముడుపోయారా? లేదా? టీజేపీ (టీడీపీ జాకాల్స్‌ పార్టీ) వారు కాకుండా బీజేపీ వారు నా మీద విమర్శలు చేస్తే సమాధానం ఇస్తా.’   అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. (అధికారం కోల్పోయినా.. సీఎం అనే భ్రమలోనే..’)

చదవండి‘మనవడితో ఆడుకోక.. ఈ  చిటికెలెందుకు?

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top