సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘం ఎన్ఎస్యూఐ నేతలకు ఈసారి ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీలుగా పోటీ చేసే అవకాశం ఇస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి హామీ ఇచ్చారు. ఎన్ఎస్యూఐ పార్టీకి ఓటుబ్యాంకు లాంటిదన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విద్యార్థి నేతలు కీలక పాత్ర పోషించాలని ఆయన పిలుపునిచ్చారు. శనివారం గాంధీభవన్లో ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడిగా బల్మూరి వెంకట్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో ఉత్తమ్ మాట్లాడుతూ కేజీటూపీజీ ఉచిత విద్య, ఫీజు రీయింబర్స్మెంట్ లాంటి కార్యక్రమాలను టీఆర్ఎస్ గాలికి వదిలేసిందన్నారు. ఫీజులివ్వమంటే డబ్బుల్లేవని చెబుతున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు రూ.300 కోట్లతో ప్రగతినివేదన సభ ఎలా పెడుతున్నారో విద్యార్థులు అర్థం చేసుకోవాలన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న కేసీఆర్ కొత్త ఉద్యోగాలు కాదు కదా కనీసం నాలుగేళ్లలో ఖాళీ అయిన ఉద్యోగాలను కూడా భర్తీ చేయలేదని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడం ఖాయమని, తాము అధికారంలోకి వచ్చాక ఫీజు రీయింబర్స్మెంట్తో పాటు నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి వీహెచ్ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి, యువజన విభాగం నాయకుడు విక్రంగౌడ్లతో పాటు అన్ని జిల్లాల ఎన్ఎస్యూఐ అధ్యక్షులు పాల్గొన్నారు.
విద్యార్థుల ఆందోళన
కాగా, ప్రమాణ స్వీకారం అనంతరం బల్మూరి వెంకట్ నేతృత్వంలో వందలాదిమంది కార్యకర్తలు గాంధీభవన్నుంచి ప్రగతిభవన్ ముట్టడికి యత్నించారు. విద్యార్థులు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ ప్రగతిభవన్ వైపు పరుగులు తీశారు. విద్యార్థులు నాంపల్లి రైల్వేస్టేషన్మీదుగా తెలుగు యూనివర్సిటీకి చేరుకుని కేసీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్కడకు చేరుకున్న పోలీసులు వారిని అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు, కార్యకర్తల నడుమ వాగ్వాదం చోటుచేసుకుంది. మాజీ ఎంపీ వీహెచ్, బల్మూరి వెంకట్తో పాటు ఎన్ఎస్యూఐ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఆందోళన ముగిసింది.
ఎన్ఎస్యూఐ నేతలకు టికెట్లు
Published Sun, Sep 2 2018 1:43 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైఎస్సార్సీపీ అభ్యర్థులకే మా మద్దతు
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
తప్పక చదవండి
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్ పిటిషన్
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
- పండ్ల తోటలకు.. 'సన్ బర్న్' ముప్పు!
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
Advertisement