పవన్ కళ్యాణ్‌ ప్రభావం లేదు | Purighalla Raghuram Comments On Pawan Kalyan | Sakshi
Sakshi News home page

పవన్ కళ్యాణ్‌ ప్రభావం లేదు

Mar 29 2019 2:35 PM | Updated on Mar 29 2019 2:39 PM

Purighalla Raghuram Comments On Pawan Kalyan - Sakshi

గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్‌ ప్రభావం లేదని, భీమవరంలో ఆయన గెలుపు కష్టమేనని రఘురాం అన్నారు.

సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్ర చంద్రబాబు నాయుడు, టీడీపీ నాయకులు, కార్యకర్తలకు ఓడిపోతామనే భయం పట్టుకుందని బీజేపీ అధికార ప్రతినిధి పి. రఘురాం ఎద్దేవా చేశారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. నిరాశ నిస్పృహలతో ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌ షా, కన్నా లక్ష్మీనారాయణల మీద టీడీపీ నాయకులు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. 20 ఏళ్లుగా చంద్రబాబు ఎవరితో ఒకరితో పొత్తు పెట్టుకునే ఉన్నారని గుర్తు చేశారు. 2019 ఎన్నికలకు మాత్రం ఒడిపోతామనే భయంతో రహస్య పొత్తులు పెట్టుకున్నారని ఆరోపించారు.


బీజేపీ నాయకుడు పి. రఘురాం

పవన్ కళ్యాణ్‌, జనసేన పార్టీ సీఎం చంద్రబాబు కంట్రోల్‌లో ఉన్నాయన్నారు. పవన్ కళ్యాణ్, కెఏ పాల్ లాంటి వాళ్ళు ఏమి మాట్లాడాలో తెలుగుదేశం పార్టీ జిరాక్స్‌ కాపీలు తయారు చేసి ఇస్తుందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్‌ ప్రభావం లేదని, భీమవరంలో ఆయన గెలుపు కష్టమేనని అన్నారు. విశాఖపట్నం  నుంచి జనసేన తరపున పోటీ చేస్తున్న సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణలో సిన్సియారిటీ లేదన్నారు. చంద్రబాబు సలహాతోనే ఆయన జనసేన పార్టీలో చేరారని రఘురాం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement