ప్రచారంలో చినరాజప్పకు చుక్కెదురు

Nimmakayala Chinnarajappa Persuaded Why They Did Not Solve Their Problems For Five Years - Sakshi

కాన్వాయ్‌ని అడ్డుకుని గోబ్యాక్‌ అంటూ నినాదాలు చేసిన గ్రామస్తులు

సాక్షి, సామర్లకోట (పెద్దాపురం) : తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట మండలం హుస్సేన్‌పురంలో ఆదివారం రాత్రి ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పకు చుక్కెదురైంది. ఆయన్ని అడ్డగించిన గ్రామస్తులు ఐదేళ్లుగా తమ సమస్యల్ని ఎందుకు పరిష్కరించలేదని నిలదీశారు. రాజప్ప కాన్వాయికి అడ్డంగా బైఠాయించారు. గ్రామంలో ఎవరికీ ఇళ్ల స్థలం ఇవ్వలేదని, గ్రామాన్ని కాలుష్య కోరల్లోకి నెట్టేశారని మండిపడ్డారు. గ్రామస్తులు సమస్యల్ని వివరిస్తుండగానే చినరాజప్ప వాహనం ముందుకు సాగింది. దీంతో వారు ’రాజప్ప డౌన్‌ డౌన్, రాజప్ప గో బ్యాక్‌’ అంటూ నినాదాలు చేశారు. ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top