సర్జికల్‌ దాడులు బీజేపీకి లాభం  | Karnataka BJP Chief Says Airstrikes Will Help Their Party | Sakshi
Sakshi News home page

సర్జికల్‌ దాడులు బీజేపీకి లాభం 

Mar 1 2019 3:19 AM | Updated on Mar 1 2019 3:19 AM

Karnataka BJP Chief Says Airstrikes Will Help Their Party - Sakshi

యశవంతపుర : సరిహద్దు వెంట పాక్‌ భూభాగంలోని జైషే ఉగ్రస్థావరాలపై భారత్‌ చేసిన సర్జికల్‌ దాడులు వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి లబ్ధి చేకూరుస్తాయని కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప అన్నారు. సర్జికల్‌ దాడుల కారణంగా కర్ణాటకలో కనీసం 22 సీట్లను గెలుచుకోగలుగుతామని యడ్యూరప్ప చేసి న వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. బుధవారం చిత్రదుర్గంలో జరిగిన బీజేపీ సమావేశంలో మీడియాతో ఆయన మాట్లాడారు. దాడులు బీజేపీకి లా భం చేకూరుస్తాయన్న వ్యాఖ్యలు ప్రచారం కావడంతో రాష్ట్ర సీఎం కుమారస్వామి, సీఎల్పీ నేత సిద్ధరామయ్య తదితరులు యడ్యూరప్పపై మండిపడ్డారు. బీజేపీ నాయకు ల నిజస్వరూపం బయటపడిందని కుమారస్వామి విమర్శించారు. యడ్యూరప్ప మాటల వీడియోను ట్విట్టర్‌లో సిద్ధరామయ్య పోస్ట్‌ చేశారు. సర్జికల్‌ దాడులపై  అనుమానంగా ఉందని వ్యాఖ్యానించారు. తన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తడంతో యడ్యూరప్ప గురువారం స్పందించారు. ఉగ్రవాదులపై దాడులను రాజకీయాలకు ఉపయోగించుకోవడం తన అభిమతం కాదని వివరణ ఇచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement