‘ఆయన చిలుక పలుకులను ప్రజలు నమ్మరు’

Gutha Sukhender Reddy Slams Chandrababu Naidu - Sakshi

సాక్షి, నల్గొండ : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిలుక పలుకులను తెలంగాణ ప్రజలు నమ్మరని టీఆర్‌ఎస్‌ ఎంపీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి అన్నారు. గురువారం నల్గొండ పట్టణంలో గుత్తా సుఖేందర్‌ రెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్‌ రావులు మీడియా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా గుత్తా మాట్లాడుతూ.. తెలంగాణలో చంద్రబాబుకు ఏం పని అని ప్రశ్నించారు. పోతిరెడ్డి పాడు ద్వారా ఇప్పటికి కూడా తెలంగాణకు రావలసిన నీటిని చంద్రబాబు దోచుకుపోతున్నాడని ఆరోపించారు.

రాహుల్‌ గాంధీ, చంద్రబాబుల ప్రచారం ఆశ్చర్యంగా ఉందన్నారు. సిద్ధాంతాలు లేకుండా కనీస విలువలు లేకుండా కలిసి తిరుగుతున్నారని మండిపడ్డారు. తెలంగాణలో వచ్చేది కేసీఆర్‌ ప్రభుత్వమేనని జోష్యం చెప్పారు. కేసీఆర్‌ నాయకత్వాన్ని తెలంగాణ సమాజం కోరుకుంటోందని చెప్పారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో సీఎం అభ్యర్థులమని చెప్పుకునే కాంగ్రెస్‌ నాయకులు ఘోరంగా పరాజయం పాలవుతారని చెప్పారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top