-
‘ఆయన చిలుక పలుకులను ప్రజలు నమ్మరు’
సాక్షి, నల్గొండ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిలుక పలుకులను తెలంగాణ ప్రజలు నమ్మరని టీఆర్ఎస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. గురువారం నల్గొండ పట్టణంలో గుత్తా సుఖేందర్ రెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్ రావులు మీడియా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా గుత్తా మాట్లాడుతూ.. తెలంగాణలో చంద్రబాబుకు ఏం పని అని ప్రశ్నించారు. పోతిరెడ్డి పాడు ద్వారా ఇప్పటికి కూడా తెలంగాణకు రావలసిన నీటిని చంద్రబాబు దోచుకుపోతున్నాడని ఆరోపించారు. రాహుల్ గాంధీ, చంద్రబాబుల ప్రచారం ఆశ్చర్యంగా ఉందన్నారు. సిద్ధాంతాలు లేకుండా కనీస విలువలు లేకుండా కలిసి తిరుగుతున్నారని మండిపడ్డారు. తెలంగాణలో వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని జోష్యం చెప్పారు. కేసీఆర్ నాయకత్వాన్ని తెలంగాణ సమాజం కోరుకుంటోందని చెప్పారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో సీఎం అభ్యర్థులమని చెప్పుకునే కాంగ్రెస్ నాయకులు ఘోరంగా పరాజయం పాలవుతారని చెప్పారు. -
సంతలో పశువులను కొన్నట్టు..
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రైతుల ఆత్మహత్యలను, రైతు సమన్వయ కమిటీలను ప్రధానంగా లేఖలో ప్రస్తావిస్తూ.. తెలంగాణ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి శ్రవణ్ దాసోజు. లేఖలో ముఖ్యమైన అంశాలు.. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమితులు రైతు సమన్వయ సమితులు కావు, రాజకీయ సమన్వయ సమితులు అని ఆయన విమర్శించారు. ఇమేజ్ తగ్గుతుందని భావించినప్పుడు ఏదో ఒక అంశాన్ని తెచ్చి హంగామా చేయడం ముఖ్యమంత్రికి అలవాటుగా మారిందన్నారు. కరువు కాటకాలతో అల్లాడిన రైతులను ఏనాడూ పట్టించుకోకుండా, ఇవాళ రైతులకు ఏదో మేలు చేస్తున్నాట్టు నటిస్తున్నారని తెలిపారు. సంతలో పశువులను కొన్నట్టు ఇతర పార్టీ నాయకులను కేసీఆర్ కొంటున్నారని ఆరోపించారు. రాజకీయ నిరుద్యోగాన్ని తీర్చడానికే రైతు సమన్వయ కమిటీల పేరుతో ఓ దళారి సంస్థను నెలకొల్పారని మండిపడ్డారు. దానికి గుత్తా సుఖేందర్ అనే ఓ రాజకీయ దళారి(బేహారి)ని అధ్యక్షుడిగా నియమించారని విమర్శించారు. సమన్వయ సమితుల్లో కేవలం టీఆర్ఎస్ కార్యకర్తలకే ప్రాధాన్యం ఇచ్చారన్నారు. ముఖ్యమంత్రి స్థాయిని దిగజార్చుతూ టీఆర్ఎస్ కార్యకర్తలకే రైతు సమన్వయ సమితుల్లో అవకాశం కల్పిస్తామనడం రాజకీయ దివాళా కోరుతననాకి నిదర్శనమని అన్నారు. కౌలు రైతును పట్టించుకోకుండా వారి ఉసురు పోసుకుంటున్నారని తెలిపారు. భూ సర్వేలో 1,61,000,00 లక్షల ఎకరాలు గుర్తించి కేవలం వారికి మాత్రమే పంట సాయం అందిస్తామంటే కౌలు రైతుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో 4500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వారి చావులను అపహాస్యం చేశారని అన్నారు. రైతులను రౌడీ మూకలుగా మంత్రి తుమ్మల, భీమ డబ్బుల కోసమే ఆత్మహత్యలు చేసుకుంటున్నారని హోం మంత్రి నాయని అంటుంటే రైతుల పట్ల వారికున్న చిత్తశుద్ధి ఏపాటిదో అర్ధమవుతుందని పేర్కోన్నారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో 300 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే కనీసం పరామర్శించే తీరిక లేని వ్యక్తి రైతుల బాధలు తీర్చడానికే సమన్వయ సమితులంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని విమర్శించారు. రైతుల భూములు లాక్కుంటూ.. వారి శ్రేయస్సు కోసం పాటుపడుతున్నట్టు ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. కల్తీ విత్తనాలు, పురుగుల మందులు అరికట్టలేని అసమర్థులంటూ ఘటైన విమర్శలు చేశారు. ఇన్నాళ్లు ప్రధాని మోదీ అడుగులకు మడుగులోత్తుతూ.. ఇప్పుడు వాడు వీడు అనడంలో మతలబు ఏమిటంటూ నిలదీశారు. ప్రధానితో చేసుకున్న లోపాయికారి ఒప్పందాలు చెడిపోయయా అని ప్రశ్నించారు. విభజన హామీ నెరవేర్చకున్న, బడ్జెట్లో రాష్ట్రానికి మొండిచేయి చూపించిన కేంద్రాన్ని పల్లేత్తు మాట అనని ముఖ్యమంత్రి ఇప్పుడేందుకు ఒంటి కాలిపై లేస్తున్నారంటూ ప్రశ్నించారు. నాలుగేళ్లుగా ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయకుండా, కాంగ్రెస్ ప్రభుత్వం 90 శాతం పూర్తి చేసిన వాటిని రీ-డిజైన్ పేరుతో కోట్లు దండుకుంటున్నారని ఆరోపించారు. ప్రజలను ఎక్కువ సార్లు మోసం చేయలేరని, మోసపోతున్నాం అని ప్రజలు గ్రహించిన మరుక్షణం వారి ఆగ్రహ జ్వాలల్లో ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ మాడిపోతుందని అన్నారు. -
'టీఆర్ఎస్, టీడీపీలు నైతిక విలువల్ని పక్కనపెట్టాయి'
నల్లగొండ: టీఆర్ఎస్, టీడీపీ పార్టీలు నైతిక విలువలు పక్కన పెట్టి దిగజారుడు రాజకీయాలకు ఆజ్యం పోస్తున్నాయని కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి విమర్శించారు. రాష్ట్ర రాజకీయాల్లో కుటుంబ సభ్యులను విడదీసే సంస్కృతిని ప్రోత్సహించడం పట్ల ఎంపీ విచారం వ్యక్తం చేశారు. ఆదివారం నల్లగొండ లో ఆయన విలేకరులతో మాట్లాడారు. తన సోదరుడు, మదర్ డెయిరీ చైర్మన్ గుత్తా జితేందర్రెడ్డి టీఆర్ఎస్లో చేరడంపై ఆయనపై విధంగా స్పందించారు. సీఎం కేసీఆర్ కుటుంబంలో కూడా ఇలాంటి అంతర్గత కలహాలు చోటు చేసుకుని.. అన్నదమ్ములను విడదీయటం, తండ్రి-కొడుకు, అన్నా-చెల్లెలు, మామ-అల్లుళ్లను విడదీసే పరిస్థితులు వస్తే ఎలా ఉంటుందని గుత్తా ప్రశ్నించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని టీఆర్ఎస్ నాయకత్వానికి విజ్ఞప్తి చేశారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 04-10)
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
ఆర్సీబీతో మ్యాచ్.. గుజరాత్ జట్టులోకి కొత్త ప్లేయర్! తుది జట్లు ఇవే
గవర్నర్పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీ దుష్ప్రచారంపై ఈసీ సీరియస్
'లగ్గం' షూటింగ్ పూర్తి.. త్వరలో థియేటర్లలో రిలీజ్
త్వరలో కాంగ్రెస్ చీలిపోతుంది: ఆచార్య ప్రమోద్ కృష్ణం
బోయింగ్ ‘స్టార్ లైనర్’.. సునీత ‘స్టార్ ట్రెక్’!
నా ఐపీఎల్ టీమ్కు మాటిచ్చా.. అందుకే సినిమాలకు బ్రేక్
పలమనేరు: ఉప్పొంగిన అభిమాన సంద్రం (ఫొటోలు)
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement