గోదావరిఖని: కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సింగరేణిలో షరతులు లేకుండా వారసత్వ ఉద్యోగాలు ఇస్తామని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి ప్రకటించారు. సోమవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణి కార్మికుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే సింగరేణి కార్మికులకు న్యాయం చేస్తామన్నారు. మారు పేర్లతో పనిచేస్తున్న వారిని క్రమబద్ధీకరిస్తామని చెప్పారు. గని కార్మికులకు ఇళ్లు నిర్మించుకునేందుకు రూ.10 లక్షల వడ్డీ లేని రుణం ఇస్తామన్నారు. అవకాశం ఉన్నా కొత్త గనులను ప్రారంభించడంలో ప్రభుత్వం ఆసక్తి చూపడం లేదన్నారు. సంస్థ సీఎండీ శ్రీధర్ టీఆర్ఎస్ పార్టీకి, ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
ఆయనపై విచారణ జరిపించి బ్లాక్ లిస్టులో పెడతామని ఉత్తమ్ తెలిపారు. సింగరేణి సీఎస్ఆర్ నిధులను సంస్థ విస్తరించిన ప్రాంతాల్లో కాకుండా సీఎం, కేటీఆర్, ఈటల రాజేందర్ నియోజకవర్గాలలో ఖర్చు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. జైపూర్ విద్యుత్ కేంద్రంలో ఇప్పటి వరకు పర్మనెంట్ ఉద్యోగులను నియమించలేదని పేర్కొన్నారు. సింగరేణి విద్యుత్ కేంద్రం నుంచి తక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేస్తున్న ప్రభుత్వం.. ఛత్తీస్గఢ్ నుంచి ఎక్కువ ధరకు ఎలా కొనుగోలు చేస్తుందని ఆయన ప్రశ్నించారు.
300 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలున్న తాడిచర్ల బ్లాక్ను ప్రైవేటు వారికి ఇవ్వడంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులు అసలే లేరని ముఖ్యమంత్రి అసెంబ్లీలో అబద్ధం చెప్పారని, కానీ.. 20 వేల మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారని తెలిపారు. వారందరినీ పర్మనెంట్ చేస్తా మని ఉత్తమ్ హామీ ఇచ్చారు. డిస్మిస్ అయిన కార్మికులను కూడా తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకుంటామని చెప్పారు. ఆయన వెంట ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ, డి.శ్రీధర్బాబు, దానం నాగేందర్, మల్లు రవి తదితరులు పాల్గొన్నారు.
షరతులు లేకుండా వారసత్వ ఉద్యోగాలు
Published Tue, Apr 3 2018 1:59 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఓటీటీకి వచ్చేస్తోన్న మర్డర్ మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
‘ప్రజ్వల్ రేవణ్ణ’ పై కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు
అమ్మానాన్న, ధర చెక్ చేయకుండానే కొనుక్కోవాలి : ఆటో డ్రైవర్ కుమార్తె ఘనత
నీ ముగ్గురు భార్యలను పరిచయం చెయ్యు పవన్ కళ్యాణ్ ను ఏకిపారేసిన ముద్రగడ
20 ఏళ్ల తర్వాత 'మన్మథుడు' హీరోయిన్ రీఎంట్రీ.. కాకపోతే!
ఓటేద్దాం.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం
27 ఏళ్లుగా ఆమె మహిళ..పెళ్లి కుదిరాక వెలుగులోకి షాకింగ్ విషయం..!
కన్నీళ్లు పెట్టుకున్న రోహిత్ శర్మ.. డ్రెస్సింగ్ రూంలో అలా!
మెట్ గాలాలో మెరిసిన ఆలియా.. ఆ చీరకు ఎందుకంత క్రేజ్ అంటే?
నష్టాల్లో ముగిసిన స్టాక్మార్కెట్ సూచీలు
తప్పక చదవండి
- అమ్మానాన్న, ధర చెక్ చేయకుండానే కొనుక్కోవాలి : ఆటో డ్రైవర్ కుమార్తె ఘనత
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ‘ఒకవేళ బెయిల్ ఇస్తే’.. కేజ్రీవాల్కు కండీషన్ పెట్టిన సుప్రీంకోర్టు
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నారా? హార్దిక్ సమాధానం ఇదే!
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వైజాగ్ మాల్యా.. వంశీ!
- LS Elections 3rd Phase: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్
Advertisement