సాక్షి, హైదరాబాద్: ముందస్తు ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు నవంబర్, డిసెంబర్లోనే ఉండొచ్చన్న సంకేతాల నేపథ్యంలో టీఆర్ఎస్ను ఢీ కొట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకుంటోంది. ఎన్నికలను సమర్థంగా ఎదుర్కోడానికి, అధికార పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తోంది. హైకమాండ్ సూచనల మేరకు పార్టీని, అభ్యర్థులను అన్ని విధాలా సన్నద్ధం చేసే దిశగా సన్నాహకాలు మొదలెట్టింది. ఇందులో భాగంగా శనివారం గాంధీభవన్లో అన్ని నియోజకవర్గాల ఇన్చార్జీలు, డీసీసీ అధ్యక్షులు, పార్టీమెంటరీ ఇన్చార్జీలతో సమావేశం ఏర్పాటు చేసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే ఈ భేటీకి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి ఆర్సీ కుంతియాతో పాటు కొత్తగా నియమితులైన ఏఐసీసీ కార్యదర్శులు, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, ప్రతిపక్ష నేతలు జానారెడ్డి, షబ్బీర్అలీ సహా ముఖ్య నేతలంతా హాజరు కానున్నారు. క్షేత్ర స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితులు, ప్రభుత్వ వైఫల్యాలు తదితరాలపై చర్చించనున్నారు.
ఉత్తమ్ 100 రోజుల ప్రణాళిక
దేశవ్యాప్తంగా వేగంగా మారుతున్న రాజకీయాలు, ముందస్తు ఎన్నికలు ఖాయమన్న సంకేతాలు కాంగ్రెస్ పార్టీని అలర్ట్ చేశాయి. తాజాగా ముందస్తుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమా? అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ విసిరిన సవాల్కు ఆ పార్టీ అంతే దీటుగా సమాధానం ఇవ్వడం రాష్ట్ర రాజకీయాల్లో వేడి పుట్టించింది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధం అని ప్రకటించిన ఉత్తమ్.. ఇందుకు 100 రోజుల కార్యాచరణ సిద్ధం చేశారు. ఆ వివరాలను కింది స్థాయి వరకు తీసుకెళ్లడం లక్ష్యంగా విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఈ వేదికగానే ఉత్తర, దక్షిణ, మధ్య తెలంగాణ బాధ్యతలను ముగ్గురు ఏఐసీసీ కార్యదర్శులకు అప్పగించిన దృష్ట్యా వారికి ఆయా నియోజక వర్గ నేతలను పరిచయం చేయనున్నారు. వచ్చే నెల నుంచే కార్యదర్శులు 25 నుంచి 90 రోజుల పాటు క్షేత్రస్థాయిలో విస్తృత పర్యటనలు చేయనుండటంతో వారికి అందించాల్సిన సమాచారంపై నేతలను సన్నద్ధం చేయనున్నారు. పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న శక్తి యాప్లో రిజిస్ట్రేషన్పై ఇందులో అవగాహన కల్పించనున్నారు.
కుంతియాకు వీహెచ్ ఫిర్యాదు
పీసీసీ అధ్యక్షుడి మార్పు ఉండదని హైకమాండ్ స్పష్టం చేసినా పార్టీ నేతలు కొందరు రహస్య మంతనాలు చేస్తుండటంపై పార్టీ వ్యవహారల ఇంఛార్జి కుంతియాకు ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు ఫిర్యాదు చేశారు. అలాంటి కుట్రదారులపై కఠినంగా వ్యవహరించాలని కోరారు. ఇలాంటి వాటిని ప్రోత్సహించరాదన్నారు.
మేమూ ‘ముందుకే’!
Published Sat, Jun 30 2018 2:02 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
Advertisement